పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ కి వచ్చి దాదాపుగా 20 సంవత్సరాలు అయిన సందర్భంగా ఛార్మి కౌర్ తన ట్విట్టర్ ఖాతాలో పూరికి సంబందించిన ఓ సంక్షిప్త ఫోటోను పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. అయితే పూరి సొంత ఊరైన నర్సీపట్నం లో తన స్కూల్ రోజుల్లో ఓ స్టేజి నాటకానికి స్టోరీ ని రాశాడు అయితే ఆ కథ తన తల్లి తండ్రికి చాలా నచ్చి మెచ్చుకున్నారట. ఆ తరువాత సినిమా ఇండస్ట్రీ కి వెళ్లేందుకు ప్రోత్సహిస్తూ ఒక పది వేల రూపాయలను ఇచ్చారంట.

 

దానితో మన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నేరుగా హైదరాబాద్ రైలెక్కేసాడు.  తరువాత తాను యాక్టింగ్ నేర్చుకోవడానికి తన తల్లిదండ్రులు ఇచ్చిన పది వేలలో ఎనిమిది వేలను తాను యాక్టింగ్ నేర్చుకునేందుకు వినియోగించాడట. మిగతా డబ్బులు తాను హైదరాబాద్ లో నివసించడానికి గాను ఉపయోగించాడట. ఇండస్ట్రీ  లో ఎన్నో కష్టాలు పడుతూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదిగాడు మన పూరిజగన్నాథ్. కొత్తగా వచ్చేవారికీ ఓ ఇన్స్పిరేషన్ లా  పూరి ఎదిగాడు ..అని చెప్పి ఛార్మి కౌర్ తన ఆనందాన్ని ట్విట్టర్ ముఖంగా తెలియజేస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: