తొలివలపు సినిమాతో మొదలైన గోపీచంద్ సినిమా కెరీర్ మొదట్లో నత్త నడకలా సాగింది. మొదటి సినిమానే ఫ్లాపవడం తో గోపీచంద్ కి మళ్ళీ సినిమా అవకాశం రాలేదు. చాలా కాలం ఖాళీగా ఉన్నాడు. అయితే తేజ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన నిజం సినిమాతో మళ్ళీ సినిమా అవకాశం దక్కించుకున్నాడు. ఈ సినిమాలో విలన్ గా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. దాంతో ఎం.ఎస్.రాజు నిర్మాతగా ప్రభాస్ త్రిష జంటగా నటించిన వర్షం సినిమాతో మరోసారి విలన్ గా ప్రేక్షకులను మెప్పించాడు. ఈ రెండు సినిమాలు గోపీచంద్ కి నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి.

 

దాంతో గోపీచంద్ తండ్రికి అత్యంత సన్నిహితుడు నిర్మాత అయిన పోకూరి బాబురావు నిర్మాతగా రూపొందించిన యజ్ఞం సినిమాతో హీరోగా మళ్ళీ అవకాశం అందుకున్నాడు. ఏ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ ని అందుకుంది. ఆ తర్వాత గోపీచంద్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరసగా మంచి హిట్ సినిమాలలో నటించారు. రణం, లక్ష్యం, లౌఖ్యం, ఇలా చాలా సినిమాలతో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఉన్నపలంగా గోపీచంద్ కి వరసగా ఫ్లాప్స్ రావడం మొదలయ్యాయి.

 

దాంతో హీరోగా క్రేజ్ తగ్గిపోయింది. మార్కెట్ కూడా బాగా తగ్గిపోయింది. 2019 లో చాణక్య సినిమా తర్వాత మళ్ళీ గోపీచంద్ సినిమా రాలేదు. ఈ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో ప్రస్తుతం ఈ మాస్ హీరో రేస్ లో బాగా వెనకబడిపోయాడు. ప్రస్తుతం సీటీమార్ సినిమా చేస్తున్నాడు గోపీచంద్, తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా మీద  మాస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే మరో సినిమాలో నటిస్తున్నానంటు అనౌన్స్ చేశాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బిను సుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుందని తాజా సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: