ప్రస్తుతం ప్రపంచదేశాలను కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వణికిస్తున్న సంగతి తెలిసిందే. మందు లేని ఈ మహమ్మానికి కట్టడి చేసేందుకు దేశదేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనాలో మొదలైన ఈ వైరస్ అనాతి కాలంలోనే ప్రపంచదేశాల ప్రజలను ముచ్చెమటలు పట్టిస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్కు బలైపోయిన వారి 1 లక్ష 50 వేలకు చేరువ అవుతుంది. మరోవైపు ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 22 లక్షలు దాటింది. ప్రస్తుతం ఈ లెక్కులు ప్రజలను తీవ్ర భయందోళనకు గురిచేస్తుతంది. అయితే ఈ కరోనా వైరస్ను కంట్రోల్ చేయడానికి పలు దేశాలు లాక్డౌన్ విధించాయి.
దీంతో అన్ని రంగాలు స్తంభించిపోయాయి. సమాన్యులతో పాటు షూటింగ్స్ లేక సెలబ్రెటీలు సైతం ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఈ లాక్డౌన్ టైమ్ సెలబ్రెటీలు తమకు నచ్చిన విధంగా మలుచుకుంటున్నారు. కొందరు వంటింట్లో గరెటలు తిప్పుతుంటే.. మరికొందరు ఇంటి పనులు చూస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే ముఖ్యంగా హీరోయిన్లు మాత్రం హాట్ హాట్ ఫోటోలతో ఇంటర్నెట్ని హీటెక్కించేస్తున్నారు. అందులో పూజా హెగ్డే కూడా ఒకరు.
2014లో వరుణ్ తేజ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో వచ్చిన ముకుందా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శాండిల్ వుడ్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్లో పూజా హెగ్డే ముందు వరుసలో ఉంటుంది. వరుస విజయాలకు తోడు స్టార్ హీరోలు కూడా పిలిచి అవకాశం ఇస్తుండటంతో ఈ ముద్దుగుమ్మ టాప్ రేంజ్లో కొనసాగుతుంది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీయార్ వంటి అగ్ర కథానాయకుల సరసన మెరిసిన పూజా హెగ్డే ప్రస్తుతం యంగ్ రెబల్స్టార్ ప్రభాస్తో నటిస్తోంది.
అలాగే అఖిల్ హీరోగా వస్తోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ అనే సినిమాలోను నటిస్తోంది. ఇక ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పూజా ఇంట్లోనే ఉంటుంది. కానీ, ఈమె మాత్రం ఖాళీగా ఉండడం లేదు. ఇటీవల పూజా హెగ్డే సోషల్ మీడియా లో షేర్ చేసిన సెల్ఫీలు నెటిజన్స్ పిచ్చెక్కించేలా వున్నాయి. అందం ముందు నుంచుని పూజా హెగ్డే తీసుకున్న సెల్పీలు తెగ వైరల్ అవుతున్నాయి. లాక్డౌన్ వేళ హాట్ సెల్పీల హంగామా ఏంటీ బాబోయ్ అంటున్నారు నెటిజన్స్. ఎందుకంటే.. పూజా అంత హాట్గా ఉంది మరి.