టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించిన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఇప్పుడు రాజకీయ నేతగా ఎదిగారు.  గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపు నుంచి పోటీ చేశారు.  కాకపోతే ఈ పోటీలో ఆయన.. ఆయన తరుపు నాయకులు ఒక్కరు తప్ప ఎవ్వరూ నెగ్గలేదు.  ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూనే సినిమాలపై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాన్.  ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు నాలుగు సినిమాలు లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్ాయి.  పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న మూవీ 'వకీల్ సాబ్'. హిందీ సూపర్ హిట్ మూవీ 'పింక్'కు ఇది రీమేక్. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు.

 

బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.  వకీల్ సాబ్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  ఈ మూవీ తర్వాత క్రిష్ తో మరో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం క్రిష్ సినిమాకి పవన్ లాంగ్ గ్యాప్ ఇవ్వబోతున్నాడట. నిజానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కొత్త షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమవ్వాలి.

 

కానీ కరోనా కారణంగా పవన్ ఈ షెడ్యూల్ ను క్యాన్సల్ చేశారు.  తాజాగా పవన్ మరో జూలై వరకూ తన పార్ట్ కు సంబంధించి ఎలాంటి షూట్ ను ప్లాన్ చెయ్యొద్దు అని పవన్ చిత్రబృందానికి తెలిపాడట. ఇక క్రిష్ తో చేస్తోన్న ఈ సినిమా ఒక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వచ్చాయి. కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ ఉండబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: