క‌న్నడ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీపరిశ్రమ స్థాయిని మరో మెట్టు పైకెక్కించిన చిత్రం 'కేజీఎఫ్‌స‌. క‌న్న‌డ యంగ్ హీరో యాశ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో కోలార్ బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాను క‌న్న‌డ బాహుబ‌లిగా విమ‌ర్శ‌కులు ప్ర‌శంసించారు. ఈ పీరియాడిక‌ల్ యశ్‌ రాఖీభాయ్‌గా కనిపించారు. కన్నడలో రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమాగా కేజీఎఫ్‌ రికార్డు కూడా సొంతం చేసుకుంది. 

 

ఈ సినిమాకు సీక్వెల్గా వ‌స్తోన్న కేజీఎఫ్ 2ను అక్టోబ‌ర్ 23న రిలీజ్ చేస్తున్న‌ట్టు ముందుగా ప్ర‌క‌టించారు. హెంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్న కేజీఎఫ్ 2 చిత్రానికి సంబంధించిన టీజర్ ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లు అవుతుండ‌డంతో పాటు క‌రోనా నేప‌థ్యంలో ప‌రిస్థితులు స‌క్ర‌మంగా లేక‌పోవ‌డం.. షూటింగ్‌లు క్యాన్సిల్ కావ‌డంతో పాటు ధియేట‌ర్లు ఎప్పుడు తెర‌చుకుంటాయో తెలియ‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

 

ఈ క్ర‌మంలోనే కేజీఎఫ్ 2 టీజర్ రిలీజ్ చేసే ప్రణాళికలు ఏమి లేవని, సినిమా రిలీజ్‌ ముందే ట్రైలర్ లాంచ్ అవుతుందని నిర్మాత కార్తీక్ గౌడ స్పష్టం చేశారు. ఇది కేజీఎఫ్ 2 కోసం ఎంతో ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తోన్న వారికి పెద్ద బ్యాడ్ న్యూసే అని చెప్పాలి. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియ‌ర్ హీరో 
సంజయ్ దత్ విలన్‌గా కనిపించనుండగా, రావు రమేష్‌, రవీనాటండన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. సాయికొర్రపాటి తెలుగులో విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: