టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ ‘జయం’ మూవీతో పరిచయం అయ్యాడు.  అప్పటి నుంచి మొన్నటి భీష్మ వరకు కెరీర్ కొరసాగిస్తూ వచ్చాడు.  అయితే హీరోగా బిగ్గెస్ట్ హిట్ చిత్రాలు ఏమీ లేకున్నా.. కెరీర్ మాత్రం ఎప్పటికీ ఉల్టా ఫల్టా కాలేదు. హీరోగా  తన ఇమేజ్ జాగ్రత్తగా కాపాడుకుంటూ అప్ కమింగ్ హీరోలకు పోటీగానే నిలుస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అఆ తర్వాత మనోడికి ఒక్కటి కూడా సరైన హిట్ పడలేదు. దాంతో డీలా పడిపోతున్న సమయంలో వెంకి కుడుముల దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్ గా ‘భీష్మ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  గత కొన్నేళ్లుగా నితిన్ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న హిట్ భీష్మతో అందుకున్నాడు.

 

మూవీ సూపర్ హిట్ అయ్యింది... తన కెరీర్ లో మంచి లాభాలు సాధించిన సినిమాగా నిలిచిపోయింది. అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల కాస్త డ్యామేజ్ అయినా.. వసూళ్ల పరంగా పరవాలేదు అనిపించింది. ఈ మూవీ బాలీవుడ్ లో రిమేక్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ మద్య తెలుగు లో మంచి హిట్ అయిన సినిమాలు వెంటనే బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

 

'అర్జున్ రెడ్డి' అక్కడ 'కబీర్ సింగ్' గా సంచలన విజయాన్ని నమోదు చేయడంతో, తెలుగు సినిమాలను హిందీలోకి రీమేక్ చేసే వేగం పెరిగింది. 'ఆర్ ఎక్స్ 100' .. 'ఓ బేబీ' సినిమాలు అక్కడ రీమేక్ గా రూపొందనున్నాయి. ఈ జాబితాలో 'భీష్మ' సినిమా కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను రణబీర్ కపూర్ హీరోగా హిందీలో నిర్మించడానికి కరణ్ జొహార్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికే వేరే సినిమాల్లో కొన్ని కమిట్ మెంట్స్ ఉండటంతో ఆ స్థానంలో అర్జున్ కపూర్ ని తీసుకునేందుకు సిద్దమయ్యారట. ఈ రీమేక్ ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: