బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. సాహో సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవగా, దక్షిణాది ప్రేక్షకులకి నచ్చకపోయినా బాలీవుడ్ ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. బాలీవుడ్ లో సాహో సినిమాకి లాభాలు వచ్చాయి. అప్పుడే బాలీవుడ్ లో ప్రభాస్ రేంజ్ ఏంటనేది అందరికీ తెలిసింది.

 

అయితే ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం దక్షిణాది వారితో పాటు బాలీవుడ్ జనాలు బాగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీరియాడికల్ లవ్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది. యూరప్ లో జరిగే కథ కాబట్టి ఎక్కువ భాగం అక్కడే షూటింగ్ చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా యూరప్ సెట్ ని హైదరాబాద్ లోనే వేయనున్నారట.

 

అయితే ఈ సినిమా నుండి అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కన్నా ముందే స్టార్ట్ అయిన చిత్రాలు అప్డేట్లతో అభిమానులకి ఆనందం పంచుతుంటే ఈ సినిమా నుండి ఒక్క అప్డేట్ ఇవ్వకపోవడం అభిమానుల్లో అసహనానికి గురి చేసింది. దాంతో ప్రభాస్ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న యూవీ క్రియేషన్స్ ని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.

 

అయితే అభిమానులు ప్రభాస్ సినిమా టైటిల్ గురించే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడే పెద్ద సమస్య వచ్చిందట. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే ఈ సినిమా కోసం ఏ టైటిల్ పెట్టాలో అర్థం కావట్లేదట. అన్ని భాషల వారికి ఒకేలా అనిపించే టైటిల్ కోసం వెతుకుతున్నారట. ప్రస్తుతం చిత్రబృందం అదేపనిలో ఉందట. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే ఈ సినిమా కోసం పాన్ ఇండియా టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: