అల వైకుంఠపురములో సినిమాలో కథానాయకిగా నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్న పూజా హెగ్డే... లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంట్లోనే తన సమయాన్ని గడుపుతున్నది. ఇప్పటివరకూ తన క్వారంటైన్ టైం లో ఏమి చేసిందో ఫోటోల ద్వారా చెప్పి తన అభిమానులను బాగా అలరించింది. 2 వారాల క్రితం తానే స్వయంగా హల్వా చేసుకొని తిన్నానని చెప్పుకొచ్చింది. ఏప్రిల్ 5వ తారీఖు మోడీ పిలుపు మేరకు దీపారాధన కూడా చేసింది. ఏప్రిల్ 7వ తేదీన తాను కఠినమైన యోగా చేస్తూ కనిపించింది. 6 రోజుల క్రితం పిజ్జా తన తల్లి కోసం తయారు చేసి తనుకూడా తింటూ కనిపించింది. 5 రోజుల క్రితం గిటార్ వాయించుతూ లాక్ డౌన్ సమయంలో తాను సంగీతాన్ని నేర్చుకుంటున్నానని తెలిపింది.


వీటితోపాటు లాక్ డౌన్ సమయంలో తాను వ్యాయామాలు చేస్తూ శారీరక దృఢత్వాన్ని పెంచుకుంటుంది. 3 రోజుల క్రితం సెక్సీ బికినీ వేసుకొని తన అందచందాలను కెమెరాలో బంధించి ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఆ ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ మిర్రర్ సెల్ఫీ ఫోటోలకి పది లక్షల పైచిలుకు లైకులు రావడం గమనార్హం. ఈ ఫోటోలో పూజా హెగ్డే నలుపు కలర్ జీన్స్ షార్ట్ ని ధరించగా... పైన పింక్ కలర్ లాంగ్ లైన్ బ్రా/క్రాప్ టాప్ ని ధరించింది. ఈ ఫోటోలలో పూజా హెగ్డే చాలా సెక్సీ గా ఉందని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. మరి వారి కోసమేనా అతి త్వరలో ఇంకా సెక్సీ ఫోటోలతో పూజా హెగ్డే మత్తెక్కించినుందో చూడాలిక. ప్రస్తుతానికైతే తన తండ్రి యొక్క పుట్టినరోజు సందర్భంగా బర్తడే కేక్ ఆమె స్వయంగా తయారు చేసింది.


టాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన పూజ హెగ్డే దేశవ్యాప్తంగా మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించిన ఏకైక కుర్ర హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం తాను సల్మాన్ ఖాన్ సరసన ఓ రొమాంటిక్ చిత్రంలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: