ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీనితో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక సినీ నటులు కూడా వాళ్ల కుటుంబ సభ్యులతో వారి సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. వారు ఎప్పుడూ చేయలేని పనులు.. ఇష్టమైన పనులు చేస్తూ ఉన్నారు. ఇక మహేష్ కరోనా బాధితుల కోసం తనకు తగ్గ స్థాయిలో వారికి సహాయం చేయడం జరిగింది.
Making the most of each day !! Game night with #Gautam❤️❤️❤️ #familytime #Quarantine #StayHomeStaySafe pic.twitter.com/kb5MhseSgH
— mahesh babu (@urstrulyMahesh) April 16, 2020
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా షూటింగ్స్ ఏమీ లేని సమయంలో ఎక్కువ శాతం ఫ్యామిలీతో గడపాలని అనుకున్నట్లు చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. తనకు ఎప్పుడు ఏ మాత్రం కొంచెం ఖాళీ సమయం దొరికినా గౌతమ్, సితార లతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ ప్రకటించడంతో షూటింగ్ లు అన్నీ కూడా నిలిచిపోవడంతో ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలాన్ని గడిపేస్తున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే... ఇక తాజాగా కొడుకు గౌతమ్ తో కలిసి హ్యాపీగా టెన్నిస్ ఆడుతున్న వీడియో మహేష్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని పోస్ట్ చేయడం జరిగింది. అందులో సరదాగా డాన్స్ వేస్తూ ఇద్దరూ కలిసి ఆడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సతీమణి నమ్రత కూడా పిల్లలతో మహేష్ తన సమయాన్ని కేటాయించి వారితో మా అనుబంధం మరింత పెరుగుతుందని తెలియజేసింది.
ఏది ఏమైనా మనం అందరమూ ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించడం మంచిది. అలాగే మనతో పాటు మన ఇరుగు పొరుగు వారిని కూడా ఈ కార్యక్రమంలో తోడుగా చేసుకుని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగుదాం. అలాగే మీకు తగినంత కొద్దీ సహాయం అవసరమైన వారికీ సహాయం అందించండి.