టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం నందమూరి యంగ్ హీరో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ లతో కలిసి రౌద్రం రణం రుధిరం సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాతగా అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ వీడియో ని ఇటీవల రిలీజ్ చేయగా, ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన రావడం జరిగింది. 

IHG's son Karthikeya's ...

1920ల కాలం సమయంలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, ఇద్దరి జీవితంలో జరిగిన యదార్ధ ఘటనలకు కొంత కల్పితాన్ని జోడించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల ఈ సినిమా ప్రెస్ మీట్ లో రాజమౌళి తెల్పడం జరిగింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా పలువురు బాలీవడ్, హాలీవుడ్ కు చెందిన నటీనటులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపుగా రూ.400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని రాబోయే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 8 న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో, దేశంలో లాక్ డౌన్ విధించడం వలన సినిమా షూటింగ్స్ అన్ని రద్దు కావడంతో, ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా నిలిచిపోయింది. 

 

ఇక నేడు ఒక ప్రముఖ న్యూస్ చానల్ కు వీడియో ఇంటర్వ్యూ ఇచ్చిన దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, ఇప్పటికే సినిమా చాలావరకు పూర్తి అయిందని, ప్రస్తుతం తమ టీమ్ కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా, అదే పద్ధతిన మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా జరుగుతోందని, అనుకున్న సమయానికే సినిమాని రిలీజ్ చేస్తాం అని చెప్పారు. అలానే తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనున్నారని అన్నారు. దీనితో ఎప్పటినుండో మహేష్, రాజమౌళి కాంబోలో సినిమాపై వస్తున్న వార్తలన్నిటి పై ఒక్కసారిగా క్లారిటీ రావడం జరిగింది. ఇక ఈ వార్త బయటకు రాగానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ పూర్తిగా సంబరాల్లో మునిగిపోయారు......   !!

మరింత సమాచారం తెలుసుకోండి: