ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలకు డిమాండ్ అనేది ఎక్కువగానే ఉంది. కమర్షియల్ గా మన సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. టాలీవుడ్ సినిమాలకు కమర్షియల్ హంగులు కూడా ఎక్కువగానే ఈ మధ్య కాలంలో కనపడుతున్నాయి. అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా ఈ మధ్య కమర్షియల్ కోణం లోనే ఉంటున్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. టాలీవుడ్ దర్శకులు కూడా ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నారు అనేది అర్ధమవుతుంది. సినిమా ఎలా ఉన్నా సరే వసూళ్లు కావాలి. 

 

దీనితో ఇప్పుడు మన తెలుగు సినిమాల మీద బాలీవుడ్ దృష్టి పెడుతుంది. ఇక్కడి సినిమాల్లో పెట్టుబడి పెట్టడానికి గానూ బాలీవుడ్ హీరోలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. సినిమా ఎలా ఉన్నా సరే కమర్షియల్ కోణం లో ఉంచి హడావుడి చేస్తే వసూళ్లు వస్తాయని ఇటీవల మహేష్ బాబు సినిమా ఒకటి నిరూపించింది. దీనితో అగ్ర హీరోల సినిమాలకు ఇక్కడ నిర్మాతలు గా వ్యవహరించాలి అని బాలీవుడ్ హీరోలు కూడా ఎదురు చూస్తున్నారని సమాచారం. టాలీవుడ్ లో సినిమాలకు బాలీవుడ్ లో కాస్త ఆదరణ ఉంది అనే విషయం తెలిసిందే. 

 

ఇప్పుడు అది ఈ కోణంలో ఉందీ అని అంటున్నారు. టాలీవుడ్ దర్శకులు కూడా బాలీవుడ్ దర్శకులకు దగ్గర కావాలి అని చూస్తున్నారు. అక్కడి సినిమాలను నిర్మించడానికి గాను మన నిర్మాతలు కూడా ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇక అక్కడి నిర్మాతలు కూడా మన తెలుగు సినిమా నచ్చుతుంది అంటే చాలు కొనుగోలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలకు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ సినిమాలకు నిర్మాతలు గా వ్యవహరించాలి అని అక్కడి హీరోలు భావిస్తున్నారని టాలీవుడ్ లో ఇప్పుడు టాక్ వినపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: