సూపర్ స్టార్ మహేష్ తన 27వ సినిమా పరశురామ్ డైరక్షన్ లో చేస్తాడని తెలుస్తుంది. మే 31 సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. జూన్ లో మొదలుపెట్టి 2021 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పరశురామ్ డైరక్షన్ లో మహేష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తుందని తెలుస్తుంది. 

 

ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాలో మహేష్ లవర్ బోయ్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. స్టార్ హీరోలు లవ్ స్టోరీలు చేయడం చాలా అరుదు. ఇలాంటి టైం లో మహేష్ లవ్ స్టోరీ చేయడం అంటే సాహసమే అని చెప్పొచ్చు. మహేష్ చాలా తక్కువ సినిమాల్లో లవర్ బోయ్ గా కనిపించాడు. ఈమధ్య మహర్షి సినిమాలోనే కాలేజ్ స్టూడెంట్ గా నటించి మెప్పించాడు. మహేష్ మరోసారి యువకుడి రోల్ లో నటిస్తాడని అంటున్నారు. త్రివిక్రమ్ తర్వాత తన పెన్ పవర్ చూపిస్తున్న పరశురామ్ మహేష్ తో మ్యాజిక్ చేసేలా ఉన్నాడు. 


ఇక ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తాడని అఫీషియల్ న్యూస్ బయటకు వచ్చింది. కె.ఎల్ నారాయణ ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కథ ఎలా ఉంటుంది.. ఎంత బడ్జెట్ లో తెరకెక్కిస్తారు.. సినిమా ఎన్ని భాషల్లో తెరకెక్కిస్తారో చూడాలి. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి చేసే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయని చెప్పొచ్చు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నిర్మిస్తున్న ట్రిపుల్ ఆర్ కచ్చితంగా బాహుబలిని మించి వసూళ్ల రికార్డులు చేస్తుందని అంచనా వేస్తున్నారు.             

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: