తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంది.. ఈ నేపథ్యంలో ఎక్కడి వ్యవస్థలు అక్కడే స్థంభించిపోయాయి. లాక్ డౌన్ కారణంగా ఎవరు ఇంటి నుంచి బయటకు రావొద్దని.. అత్యవసర పరిస్థితిల్లోనే బయటకు రావాల్సి ఉంటుందని అన్నారు.  లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ షెట్ డౌన్ అయ్యింది. దాంతో హైదరాబాదులోని పలు స్టూడియోల కార్యకలాపాలు నిలిచిపోయాయి.   తెలుగు సినీ పరిశ్రమలో ఇబ్బందులు పడుతున్న వందలాది సినీ కార్మికులను ఆదుకునేందుకు స్టార్ హీరోలు నడుం బిగించారు.  ఈ నేపథ్యంలో  అక్కినేని నాగార్జున స్పందించారు.

 

లాక్ డౌన్ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో మరో విధంగా ఉపయోగపడిందని తెలిపారు. టాలీవుడ్ సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ అందించే నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులను భద్ర పరిచేందుకు గోడౌన్ లా ఉపయోగించామని వెల్లడించారు.  తెలుగు సినీ పరిశ్రమ ప్రారంభించిన కరోనా క్రైసిస్ ఛారిటీకి పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. 

 

గత కొన్నిరోజులుగా అన్నపూర్ణ స్టూడియో ఓ బేస్ క్యాంపుగా మారిపోయిందని, ఇక్కడి నుంచే వాహనాల్లో సరుకులను సినీ కార్మికుల వద్దకు తరలించామని, అందుకు సహకరించిన 50 మంది మెహర్ బాబా ట్రస్ట్ వలంటీర్లకు అభివందనాలు అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. అదే విధంగా మెహర్ రమేశ్ కు, దర్శకుడు ఎన్.శంకర్, వారి బృందాలకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మరసారా కోరుకుంటున్నానని అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: