కిక్ నుండి మాస్ మహారాజ్ రవితేజ కు ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయాడు థమన్. ఈ సినిమా తరువాత ఎక్కువగా రవితేజ , థమన్నే సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడు. థమన్  కూడా ఆ నమ్మకాన్ని చాలా సార్లు నిలబెట్టుకున్నాడు. అయితే ఈ సారి మాత్రం థమన్ కాకుండా  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లైన్లోకి  వచ్చాడు. రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ తో  రవితేజ రెండో సారి సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి దేవి సంగీతం అందించనున్నాడని సమాచారం. గతంలో రవితేజకు దేవి... వెంకీ , భద్ర ,సారొచ్చారు వంటి మ్యూజికల్ హిట్లు ఇచ్చాడు మరి ఈసారి కూడా  అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందో చూడాలి.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లోవున్న ఈ చిత్రం జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. సత్యనారాయణ కోనేరు , హవీష్ కోనేరు నిర్మించనున్న ఈ చిత్రం ఈఏడాది  చివర్లో విడుదలకానుంది. 

 
ఇదిలావుంటే రవితేజ ప్రస్తుతం క్రాక్ లో నటిస్తున్నాడు. గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం లో రవితేజ తనకు బాగా కలిసొచ్చిన పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తుండగా ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 8న విడుదలచేద్దాం అనుకున్నారు కానీ కరోనా వల్ల విడుదల వాయిదా పడింది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
 
ఇక గత కొంత కాలంగా వరస పరాజయాలను చవిచూస్తున్న రవితేజ, క్రాక్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈసినిమా లతో పాటు ఇటీవల రవితేజ  మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అందులో త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో ఓ  సినిమా చేయనుండగా నాపేరు సూర్య ఫేమ్ వక్కంతం వంశీ తోకూడా సినిమా చేయనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: