దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న లేటెస్ట్ భారీ మల్టిస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇండియా మొత్తం అన్ని రంగాలు మూత పడడం, దానితో సినిమా రంగం కూడా బంద్ కావడంతో ఎక్కడి షూటింగ్స్ అక్కడ నిలిచిపోవడంతో ఇటీవల నిలుపుదల చేయబడింది. ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య దాదాపుగా రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్న ఈ సినిమాకు ఇటీవల రౌద్రం రణం రుధిరం టైటిల్ ని ఖరారు చేయడంతో పాటు సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయగా దానికి ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన లభించింది. 

IHG

ఇక ఆపై రామ్ చరణ్ పుట్టినరోజున ఆయన పోషిస్తున్న అల్లూరి పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ వీడియో ని భీం పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ తో రిలీజ్ చేయించింది సినిమా యూనిట్. కాగా ఆ వీడియోకి కూడా అద్బుతమైన స్పందన లభించింది. ఇక నిన్న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో ప్రత్యేకంగా వీడియో ఇంటర్వ్యూ లో మాట్లాడిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలిపారు. సినిమాని అనుకున్న విధంగా రిలీజ్ చేస్తామా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం అని చెప్పిన రాజమౌళి, రాబోయే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉండడంతో ఆరోజున ఎన్టీఆర్ కొమరం భీం లుక్ ని కూడా రిలీజ్ చేస్తారా ఎన్ని న్యూస్ రీడర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, అది ఒకరకంగా కుదరకపోవచ్చని అన్నారు. 

 

ఎందుకంటే, రామ్ చరణ్ టీజర్ కి సంబందించిన వీడియో ఫుటేజ్ తమ వద్ద అందుబాటులో ఉందని, అయితే అది కూడా ఎనభై శాతం మాత్రం ఉన్నప్పటికీ, మిగతా ఎడిటింగ్ వంటివి తమ టీమ్ ఎంతో కష్టపడి నిర్వహించి దానిని రిలీజ్ చేసారని, అయితే కొమరం భీం పాత్ర తాలూకు ఫుటేజ్ అంతా కూడా ఆఫీస్ లో ఉండిపోయిందని, ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితులు ఎప్పుడు ముగుస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది కాబట్టి, ఇటువంటి టైంలో తన టీజర్ రిలీజ్ చేసే అవకాశం చాలావరకు లేదని, అయితే అదే రోజున ఇంకేదైనా సర్ప్రైజ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అందించాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు రాజమౌళి. మరి ఇదే కనుక నిజం అయితే మాత్రం పాపం కొమరం భీం లుక్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆయన ఫ్యాన్స్ కు ఇది పెద్ద చేదు వార్తే అని చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: