పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పింక్' రీమేక్ 'వకీల్ సాబ్' లో నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంజలి, నివేతా థామస్, అనన్య నాగల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా... ప్రకాష్ రాజ్ అతి కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీత బాణాలు అందిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ముగ్గురు యువతులను కాపాడే ఓ న్యాయవాది గా కనిపించనున్నాడని తెలుస్తోంది.


అయితే ఈ సినిమా విషయం పక్కన పెడితే... పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబు నిర్మాణంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా తో ఇటీవల మాట్లాడిన మెగా బ్రదర్ నాగబాబు... తాను తన తమ్ముడు పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో కలిసి ఒక సినిమాని వెండి తెరపైకెక్కించనున్నాని తెలిపారు. ఆ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లు నాగబాబు తెలిపారు. క్రిష్ జాగర్లమూడి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా చాలా పెద్ద ప్రాజెక్ట్ అని ఆయన అన్నారు. ఔరంగజేబు సమయంలో చోటు చేసుకున్న సన్నివేశాలను ఆధారంగా తీసుకొని చారిత్రాత్మక డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక దొంగ పాత్రలో నటించనున్నాడని సమాచారం.


రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ వకీల్ సాబ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న పవన్ కళ్యాణ్ రాజకీయంలో కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు. ఏదో డబ్బుల కోసం మాత్రమే తాను సినిమాలు తీస్తున్నానని... లేకపోతే పూర్తిగా రాజకీయ రంగంలోనే తన జీవితాన్ని అంకితం చేసేవాడినని ఆయన అన్నారు. ప్రస్తుతానికి తాను తన జనసేన పార్టీ కార్యకర్తల సహకారంతో లాక్ డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పేదవారికి అండగా నిలుస్తూ అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: