ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌క్క‌న గబ్బర్ సింగ్ లో సరసన మెరిసి, మాంచి మార్కులు కొట్టేసింది శృతిహాసన్. ఆ సినిమాలో ఈ ఇద్ద‌రు జోడీకి మంచి మార్కులే ప‌డ్డాయి. ఆ త‌ర్వాత ఈ జంట మ‌రోసారి కాట‌మ‌రాయుడు సినిమాలో మెప్పించింది. అయితే కాట‌మ‌రాయుడులో క‌నిపించినా ఈ జంట మ‌ధ్య గ‌బ్బ‌ర్‌సింగ్ స్పార్క్ అయితే క‌న‌ప‌డ‌లేదు. మ‌ళ్లీ ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత ఈ జోడీ వ‌కీల్‌సాబ్‌లో క‌నిపిస్తుంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

 

అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఈ న్యూస్‌పై లెక్క‌లేన‌న్ని సందేహాలు వ‌స్తున్నాయి. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ఆల‌స్య‌మైంది. ఇక ఇప్పుడు శృతి డేట్లు దొరుకుతాయో ?  లేదో ? అన్న సందేహాలు ఉన్నాయి. ఇక ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ఇప్పుడు శృతి డేట్లు దొర‌క్కపోతే చేసేదేం లేద‌ని కూడా చెప్పేశాడు. అంటే దీనిని బ‌ట్టి ఈ సినిమాలో శృతి చేయ‌డం లేద‌ని.. వేణు మాట‌ల అర్థం అదేనని చాలా మంది చెపుతున్నారు.

 

ఇటీవ‌ల బాలయ్య, చిరు, పవన్ లాంటి సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టం అవుతోంది. ఈ లిస్టులో చిరు, బాల‌య్య ఇబ్బందులు మామూలుగా లేవు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ కూడా వారికి తోడు అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: