తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి తన సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు. స్వశక్తి తో తన అద్భుతమైన నటనతో మెప్పించి సుప్రీం స్థాయి నుండి మెగాస్థాయికి చేరుకున్నారు మన చిరంజీవి అలియాస్ శివ శంకర వర ప్రసాద్. కరోనా కారణంగా దేశ దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి . దేశాలకు లాక్ డౌన్ మాత్రమే పరమౌషధంగా ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. ప్రభుత్వాలకు సంగీభావంగా ప్రజలను కరోనా నుండి మేల్కొలిపే దిశగా కరోనా హెచ్చరిక ప్రకటనలు కూడా చేశారు.
చిరంజీవి లాక్ డౌన్ సమయంలో ఊరికే కూర్చోక తనవంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఉపాధిని కోల్పోయిన సినీ బడుగు వర్గాలను ఆదరించే విధంగా సినీ ప్రముఖులనుండి విరాళాలు సేకరించి వారిని ఆదుకున్నాడు . కెసిఆర్ పిలుపు మేరకు రక్త ధనాన్ని చేయడానికి చిరంజీవి పూనుకున్నారు .స్వయానా వెళ్లి చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో తన రక్తాన్ని శరణార్థులకు ఉపయోగ పడేలా సహాయ పడ్డారు మన మెగాస్టార్ ...ఈ రక్తదానానికి సంబందించిన ఫోటోలను ట్విట్టర్ ఖాతాలో పొందుపరచారు
Megastar and also a humble person! @KChiruTweets donates blood today at #ChiranjeeviBloodBank #MegastarChiranjeevi pic.twitter.com/4d8yuir7wT
— Shreyas Group (@shreyasgroup) April 19, 2020