టాలీవుడ్ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఎంతో భారీగా, అత్యాధునిక సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తి అయింది. ఇటీవల ఈ సినిమా షెడ్యూల్ ని శేషాచలం అడవుల్లో చిత్రీకరించింది యూనిట్. ఇక ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో మన దేశాన్ని మే 3 వరకు పూర్తిగా లాకౌట్ ప్రకటించడం, అలానే సినిమా షూటింగ్స్ అన్ని బంద్ కావడంతో ఈ సినిమా షూట్ కూడా నిలుపుదల చేయబడింది. 

 

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. కాగా గతంలో సుకుమార్ దర్శకాత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా మాదిరిగా ఈ పుష్ప సినిమా కూడా సూపర్ హిట్ కొట్టడం ఖాయం అంటూ ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ తరువాత నుండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో బలంగా నమ్ముతున్నారు. దానికి ప్రధాన కారణం ఈ సినిమా కథని అంటున్నారు. 

 

కథల పరంగా, రంగస్థలంతో పుష్పకు పోలిక లేనప్పటికీ, ఆ సినిమా మాదిరిగా పలు మాస్, కమర్షియల్ హంగులతో దర్శకుడు సుకుమార్ దీనిని తెరకెక్కిస్తున్నారని, అలానే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ లో తమ హీరో అల్లు అర్జున్ ని ఒకసారి గమనిస్తే, ఆయనది సినిమాలో ఫుల్ పక్కా మాస్ రోల్ అని అర్ధం అవుతుందని, అందులోనూ సుకుమార్ తీసే ప్రతి సినిమాలో ఆడియన్స్ ని థ్రిల్ చేసే ఏదో ఒక గొప్ప అంశం ఉంటుందని, అలానే తప్పకుండా ఈ సినిమాలో కూడా ఆయన అటువంటి మంచి థ్రిల్లింగ్ పాయింట్ ని జొప్పించి ఉంటారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆశలు పెట్టుకున్న పుష్ప సినిమాని రంగస్థలం సినిమా మాదిరిగా సుకుమార్ మంచి విజయవంతం చేస్తారో లేదో తెలియాలంటే మరికొద్దిరోజులు వరకు వెయిట్ చేయాల్సిందే......!!

మరింత సమాచారం తెలుసుకోండి: