అందాల దీపికకు సొగసుతో మత్తెక్కించడమేకాదు, చూపుతో చిత్తు చేయడమూ తెలుసు. ఇక ఆమె బాలీవుడ్ సూపర్ స్టార్ డం ని ఎంజాయ్ చేస్తోంది. కుర్రకారు గుండెలని నమిలేస్తూ తనకు సాటీ పోటీ లేదనిపించుకుంటోంది.

 

బాలీవుడ్లో క్వీన్ గా రాణిస్తున్న దీపికాని మన టాలీవుడ్లోకి రప్పించాలని ఎన్నాళ్ళుగానో ఇక్కడ నిర్మాతలు  చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఎపుడూ కొలిక్కి రావడం లేదు. బ్రేకులు పడుతున్నాయి కూడా. దీపికా తన డిమాండ్ తో ఎప్పటికపుడు టాలీవుడ్ నిర్మాతలకు షాకులిచ్చేస్తోంది.

 

ఇదిలా ఉండగా వైజయంతి మూవీస్ పతాకంపైన మళ్ళీ సినిమాలు వరసగా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేస్తున్నారు. ఆయన తాజాగా తీసిన మహానటి మూవీ ఇటు కలెక్షన్లనూ, అటు జనాదరణను ఒకేసారి కొల్లగొట్తి మరపురాని సినిమాగా నిలిచిపోయింది. జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకుంది.

 

మహానటి మూవీని డైరెక్ట్ చేసింది అశ్వనీదత్ అల్లుడు, యువ దర్శకుడు నాగ్ అశ్విన్. ఆయన తన మరో ప్రయత్నంగా ఇదే బ్యానర్ మీద పాన్ ఇండియా మూవీ తీసేందుకు రెడీ అయిపోతున్నారు. పాన్ ఇండియా మూవీ అంటే గుర్తుకువ్ వచ్చేది ప్రభాస్ మాత్రమేనని నాగ్ అశ్విన్ అంటున్నారు. తన కధకు ఆయనే కరెక్ట్ హీరో అని కూడా చెప్పుకున్నాడు.

 

సరే హీరో రెడీ అయిపోయాడు. హీరోయిన్ ఎవరు అన్న ప్రశ్న వచ్చింది. పాన్ ఇండియా మూవీ కాబట్టి దీపికాను తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారుట. అయితే దీపికా ఈ మూవీలో చేసేందుకు రెడీ అంటోంది కానీ రెమ్యునరేషన్ చెప్పి గట్టి షాక్ తినిపించిందిట. 

 


ఏకంగా పాతిక కోట్లను డిమాండ్ చేసిందట. దీంతో నిర్మాతలు ఆలోచనల్లో పడ్డారుట. ఇంత పెద్ద మొత్తం దీపిక అడగడం సమంజసమేనని, అయితే బడ్జెట్  పర్మిట్ చేస్తుందా అన్నది ఆలోచిస్తున్నారుట. నిజంగా అన్నీ కుదిరి దీపికా ప్రభాస్ జోడీ తెర మీద మెరిస్తే ఆ లుక్కే వేరుగా ఉంటుంది.

 

పైగా పాన్ ఇండియా మూవీ రూపేణ దీపికను మన తెలుగు తెర మీద కూడా చూడొచ్చు. మరి నాగ్ అశ్విన్ ఏ డెసిషన్ తీసుకుంటాడో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: