నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతుంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక బాలయ్య గత మూడు సినిమాలు ఫ్లాపయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ గా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు తెరకెక్కించగా భారీ ఫ్లాప్స్ గా మిగిలాయి. క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా మీద భారీ అంచనాలున్నపటికి ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. వాస్తవంగా ముందు ఈ సినిమాకి తేజ డైరెక్టర్ అనుకున్నప్పటికి ఎందుకనో తను డ్రాపయ్యాడు. దాంతో ప్రాజెక్ట్ క్రిష్ చేతిలో పడింది. బాలయ్య క్రిష్ కాంబినేషన్ లో గౌతమీ పుత్ర శాతకర్ణి బ్లాక్ బస్టర్ కావడం తో బాలయ్య ఈ ప్రాజెక్ట్ ని క్రిష్ కి అప్పగించారు. కాని రిజల్ట్ తేడా కొట్టింది.

 

ఇక ఆ తర్వాత వచ్చిన 'రూలర్' సినిమా కూడా బాలయ్యకు హిట్ ఇవ్వలేదు. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన రూలర్ మీద కూడా నందమూరి ఫ్యాన్స్ బాగా నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా కూడా బాగా డిసప్పాయింట్ చేసింది. ఇక ప్రస్తుతం తనకి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను తో బాలయ్య సినిమా చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేయాలన్న షెడ్యూల్స్ ప్లాన్స్ వేసుకున్నప్పటికి కరోనా కారణంగా మొత్తం షెడ్యూల్స్ అన్ని మారిపోయాయి. ఇప్పుడు మళ్ళీ షెడ్యూల్స్ ప్లాన్ చేయాలంటే కాస్త రిస్కే. అయినా ఈ సినిమాని కంప్లీట్ చేయాలని పంథాలో ఉన్నట్టు తెలుస్తుంది. 

 

ముందుగా అనుకున్న ప్రకారం దసరా కి రిలీజ్ చేయాలనుకున్నారు బాలయ్య బోయపాటి. కాని ఇప్పుడు పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదని క్లియర్ గా అర్థమవుతుంది. అయినా మే 7 న లాక్ డౌన్ ఎత్తివేయగానే కాస్త గ్యాప్ తీసుకొని పరిస్థితులు అనుకూలంగా ఉంటే తిరిగి షూటింగ్ మొదలు పెట్టాలన్న ఆలోచనలో బోయపాటి ఉన్నారట. అంతేకాదు ఎటువంటి పరిస్థితిలో అక్టోబర్ అనుకున్నది డిసెంబర్ లోపు అయినా రిలీజ్ చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారట. ముఖ్యంగా అక్టోబర్ కే పక్కా ప్లాన్ ఉందని ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: