వర్ధమాన నటి శ్రీరెడ్డి ముందుగా న్యూస్ ఛానల్ యాంకర్ గా, ఆపై అక్కడక్కడ కొన్ని సినిమాలలో చిన్న పాత్రల్లో నటించడం జరిగింది. అనంతరం ఒకానొక సమయంలో తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, కొందరు సినిమా వ్యక్తులు, ఇక్కడికి అవకాశాల కోసం కొత్తగా వస్తున్న అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి, వారిని లైంగికంగా పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. అప్పట్లో ఆమె చేసిన ఆరోపణలపై మా అసోసియేషన్ దిగిరాకపోవడంతో, అనంతరం వారి ఆఫీస్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించింది శ్రీరెడ్డి. దానితో దిగొచ్చిన మా అసోసియేషన్ వారు, ఇకపై అసోసియేషన్ లో ఆడవారి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 

 

అయితే ఆ ఘటన తరువాత మంచి పేరు దక్కించుకున్న శ్రీరెడ్డి, అనంతరం కొందరు సినిమా నటులు తనకు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి లైంగికంగా వాడుకుని మోసం చేసారని ఆరోపిస్తూ పలువురి పేర్లు బయట పెట్టగా, వారిలో కొందరు శ్రీరెడ్డిపై విరుచుకుపడడం జరిగింది. కాగా ఆ తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆమె చేసిన ఒక తప్పుడు వ్యాఖ్య అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. దానితో పవన్ ఫ్యాన్స్, శ్రీరెడ్డిపై విరుచుకుపడడం, అక్కడి నుండి ఆమె పవన్ ఫ్యాన్స్ ని నానా మాటలు అందడం జరిగింది. ఇక ఇటీవల చెన్నై కి వెళ్లిపోయిన శ్రీరెడ్డి, తమిళ ప్రజలు అంటే తనకు ఎంతో ఇష్టం అని, ఇక్కడి సినిమాలన్నా, నటులన్నా తనకు ఎంతో అభిమానమని ఇటీవల తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం జరిగింది. 

 

మొన్న ఏకంగా అమ్మ జయలలిత మీద ఒక టిక్ టాక్ వీడియో చేసి పోస్ట్ చేసిన శ్రీరెడ్డి, తాను ఒక వజ్రాన్నని, కాబట్టే తాను కేవలం వజ్రాలతో మాత్రమే పోటీ పడతానని, అంతేతప్ప చెత్త బుట్టతో కాదని అంటూ నేడు ఒక ఆసక్తికర ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఆమె పెట్టిన ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టిందబ్బా అని ఆలోచిస్తూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరేమో శ్రీరెడ్డి మళ్ళి ఇంకెవరినో టార్గెట్ చేస్తోంది, ఆమె మాటల్లో ఏదో అంతార్ధం దాగి ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: