టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలకు మార్కెట్ అనేది భారీగా పెరిగింది కాబట్టి హీరోలు ఇప్పుడు మార్కెట్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. టాలీవుడ్ హీరోలకు ఇతర భాషల మీద కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ని ఈ నెల 31 న మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. లేదా వచ్చే నెల 31 న మొదలు పెడతారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు మహేష్ బాబు తర్వాత చేసే సినిమా కూడా ఖరారు అయింది. 

 

రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నాడు మహేష్ బాబు. కథ కూడా రెడీ గా ఉందని సమాచారం. దీనిపై జక్కన్న కూడా ప్రకటన చేసాడు. ఈ సినిమాకు నిర్మాతగా తానే వ్యవహరించాలి అని మహేష్ బాబు భావిస్తున్నట్టు సమాచార౦ ఎంత బడ్జెట్ అయినా సరే తానే ఈ సినిమాను నిర్మించాలి అని మహేష్ బాబు ఎక్కువగా భావిస్తున్నాడు. ఈ సినిమాలో తాను పెట్టుబడి పెడతాను అని కూడా చెప్పేశాడట. మహేష్ బాబు ఓకే అనడం తో ఈ సినిమాకు మరో నిర్మాత కూడా ముందుకి రావడం లేదని సమాచారం. 

 

ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు భారీగా బరువు కూడా పెరిగే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అతను ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తాడు అని అతని గ్లామర్ ని పక్కన పెట్టి ఈ సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 400 కోట్ల బడ్జెట్ ని పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించడం దాదాపుగా ఖాయం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: