రాజమౌళి తన తదుపరి మూవీ మహేష్ తో చేయబోతున్నాను అంటూ ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లీకులు కరోనా టైమ్ లో స్తబ్దంగా ఉన్న ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారితే మహేష్ అభిమానులు మాత్రం రాజమౌళి ఇచ్చిన లీకులను వేరొక కోణంలో విశ్లేషిస్తూ సూపర్ స్టార్ పై తమ వీరవిధేయతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ 2021లో విడుదల అవుతుంది.


ఆసినిమా హడావిడి పూర్తి అయిన తరువాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకుని రాజమౌళి మహేష్ తో సినిమా ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించినా ఆమూవీ షూటింగ్ ప్రారంభం అయ్యేసరికి 2022 వచ్చేస్తుంది. సాధారణంగా రాజమౌళి టాప్ హీరోలతో తీసే సినిమాలకు కనీసం రెండు సంవత్సరాల టైమ్ పడుతుంది. దీనితో అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే రాజమౌళి మహేష్మూవీ విడుదల కేవలం 2024లో మాత్రమే అన్న ఊహాగానాలు అప్పుడే మహేష్ అభిమానులు మొదలు పెట్టేసారు.


ప్రస్తుతం ప్రారంభం కావలసి ఉన్న మహేష్ పరుశు రామ్మూవీ షూటింగ్ కరోనా హడావిడి తరువాత ప్రారంభం అయితే ఆమూవీ వచ్చేఏడాది మాత్రమే విడుదల అవుతుంది. ఆతరువాత మహేష్ రాజమౌళి బంధిఖానాలోకి వెళ్ళిపోతే మరో రెండుసంవత్సరాల వరకు తమ హీరో నుండి సినిమా లేకుండా ఎలా ఉండాలి అంటూ అప్పుడే మహేష్ అభిమానులు నిరాశపడిపోతున్నారు. అంతేకాదు ఊహించిన విధంగా మహేష్ పరుశు రామ్మూవీ సూపర్ హిట్ కాకపోతే మహేష్ నుంచి మరొక బ్లాక్ బష్టర్ హిట్ రావడానికి రాజమౌళి సినిమా వచ్చేదాకా మూడు సంవత్సరాలు వేచి ఉండాలా అంటూ మహేష్ అభిమానులు ఒకవిచిత్ర వితండవాదాన్ని ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు. 


ఇది ఇలా ఉండగా రాజమౌళి మహేష్ తో సినిమా చేయబోతున్నాను అంటూ లీకులు ఇవ్వగానే అప్పుడే ఈసినిమా కథకు సంబంధించిన వార్తలు కూడ హడావిడి చేయడం ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తలప్రకారం రాజమౌళి మహేష్ తో తీయబోయే మూవీ ఒక జేమ్స్ బాండ్ స్పై థ్రిల్లర్ మూవీ అని హాలీవుడ్ స్పై థ్రిల్లర్ మూవీల స్థాయిలో 400కోట్ల భారీ బడ్జెట్ తో ఈసినిమా ఉంటుంది అంటూ మహేష్ అభిమానులు మరొక సరికొత్త ప్రచారం మొదలుపెట్టారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో సినిమా నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్ లో అనేకమార్పులు వస్తాయి అని స్వయంగా రాజమౌళి చెపుతున్న సందర్భంలో మహేష్ అభిమానులు ఏకంగా రాజమౌళి మహేష్మూవీ ప్రాజెక్ట్ 400 కోట్లతో ఉంటుంది అని ఊహించుకోవడం ఒకవిధంగా మితిమీరిన ఉత్సాహమే అనుకోవాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: