దేశంలో కరోనా వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే. ప్రపంచలో ఇప్పుడు కరోనా వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనుషులను మనుషులు చూస్తేనే భయంతో వణికి పోతున్నారు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు. కరోనాతో ఎవరైనా మరణించినా కూడా వారి వద్దకు వెళ్లాలంటే భయంతో పారిపోతున్నారు. ఇటలీ 23,227 మరణాలతో యూరప్ లో ప్రథమస్థానంలో ఉంది. స్పెయిన్ లో 20,453, ఫ్రాన్స్ లో 19,323, బ్రిటన్ లో 15,464 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇక ప్రపంచం మొత్తమ్మీద కరోనా కేసుల విషయానికొస్తే ఇప్పటివరకు 23,34,130 పాజిటివ్ కేసులను గుర్తించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.
భారత్లో కరోనా కేసుల సంఖ్య మొత్తం 15 వేలు దాటింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 15,712కు చేరగా, ఇప్పటివరకు మొత్తం 507 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. అయితే కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించారు. దాంతో సెలబ్రెటీలు ఇంటి పట్టున ఉంటున్న విషయం తెసిందే. ఇంట్లో నుంచి వారు ఏం చేస్తున్నారో వీడియెలు, ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ లు ఎలా తయారు చేసుకోవాలి... ఇంట్లో ఎలా టైమ్ పాస్ చేసుకోవాలి.. కొత్త వంటకాలు తయారు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ నటుడు మంచు విష్ణు, తన ముఖానికి మాస్క్ ను తానే స్వయంగా తయారు చేసుకున్నాడు. పాత టీ-షర్ట్ ను ఉపయోగించి, ఇంట్లోనే దీన్ని రూపొందించానని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించాడు. మీ దగ్గర టీ-షర్ట్ ఉందా? మీరు కూడా మాస్క్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మీరు తయారు చేసుకోవొచ్చు.. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. అందరూ మాస్క్ను తయారు చేసుకోండి. సురక్షితంగా ఉండండి" అని ట్వీట్ పెట్టాడు.
Save the surgical masks for the frontline workers who are saving us.
— vishnu Manchu (@iVishnuManchu) April 19, 2020
Got a t-shirt? You can make a mask at home too. I’m wearing a homemade mask, made by ripping apart an old t-shirt.
Spread the word. Make a mask. Stay safe.
#MaskIndia pic.twitter.com/Q3YtvNHYfk