ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోయిన మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య ఆశించిన స్థాయిలో హిట్ అనుకోలేకపోతున్నాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన రవితేజ గత చిత్రం 'డిస్కోరాజా' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయినా సరే సినిమాల స్పీడ్ ను మాత్రం పెంచుతూనే ఉన్నాడు. రవితేజ ప్రస్తుతం కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న 'క్రాక్' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డాన్‌ శీను, బలుపు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న రవితేజ, గోపిచంద్‌ మలినేనిలు హ్యాట్రిక్‌ హిట్ కోసం రెడీ అవుతున్నారు.

 

ఈ క్రమంలో రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం. దాంతో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం.. మరో హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ లో నభా నటేష్,  నిధి హీరోయిన్స్ గా నటించారు. మళ్లీ ఇప్పుడు రవితేజ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

 

అయితే ఈ సినిమా తమిళ రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. అరవింద స్వామి, త్రిష కలయికలో రానున్న ‘శతురంగ వెట్టై 2’ చిత్రాన్నే తెలుగులో రవితేజ చేయబోతున్నాడని ఆ వార్తల సారాంశం. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట. ఇప్పటికే సగం పైగా షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రాన్ని కరోనా తగ్గాక విడుదల చేయాలనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: