బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసి దేశవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ అయిపోయిన రాజమౌళి ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమా  షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పెట్టి ఈ మూవీని చాలావరకూ పూర్తి చేశాడు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అన్ని బాగుంటే వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నాడు కానీ షూటింగ్ వాయిదా పడటంతో వచ్చే మార్చి కి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఎక్స్పర్ట్ లు చెబుతున్నారు. అయితే  ఆర్ ఆర్ ఆర్ తర్వాత మహేష్ బాబు తో రాజమౌళి సినిమా చేయడానికి స్టోరీని సిద్ధం చేస్తున్నాడు.

 

దానికి సంబంధించి ఇప్పటికే దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్ నారాయణ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నట్టు తెలిపాడు. అయితే చాలా రోజులుగా ఆ సినిమా మహేష్ బాబు తో చేయలేకపోయాను. నా  తదుపరి సినిమా మహేష్ బాబుతో కలిసి చేస్తానని చెప్పుకొచ్చాడు.  అయితే మహేష్ బాబు కోసం రాజమౌళి కౌబాయ్ మరియు జేమ్స్ బాండ్ లాంటి కథలను రాయిస్తున్నాడని  తెలియజేశాడు. ఇప్పటికే  మహేష్ మరియు  రాజమౌళి  స్టొరీ లైన్ గురించి మాట్లాడుకున్నారు. అంతా కూడా వీరిద్దరి సినిమా హాలీవుడ్ స్టైల్లో ఉండబోతుందని ఆశిస్తున్నారు. మరి వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందన్న ఆతృత అందరిలోనూ  ఉత్కంఠ రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: