ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇంట్లో ఈ రోజు ప‌ని చేస్తున్నారు. సెల‌బ్రెటీలంద‌రూ కూడా ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌వ్వ‌డంతో ఒకొక్క‌రూ ఒక్కోప‌నిలో నిమ‌గ్న‌మ‌యి ఉన్నారు. కొంద‌రు వంట‌లు చేస్తూ యూట్యూబ్‌లో వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తుంటే. మ‌రి కొంద‌రు వారి పిల్ల‌ల‌తో టైమ్‌పాస్ చేస్తున్నారు. ఇంకొంద‌రు బుక్స్ చ‌దువుతూ స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. ఇలా ఒకొక్క‌రు త‌మ త‌మ హ్యాబిట్స్‌ని బ‌ట్టి ఒకొక్క‌రూ ఒక్కో ప‌నిలో నిమ‌గ్న‌మ‌యి ఉన్నారు. మొత్తానికి ఫ్యాన్స్‌కి మాత్రం ట‌చ్‌లో ఉంటూ నిరంత‌రం వాళ్ళ‌కు ఏదో విధంగా ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు.

 

రాజ‌మౌళి ఈ క్ర‌మంలోనే ఓ టీవీ ఛాన‌ల్ లైవ్‌లో ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి ఛాలెంజ్ స్వీక‌రించారు రాజ‌మౌళి.  అర్జున్‌రెడ్డి చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టారు ద‌ర్శ‌కుడు సందీప్ వంగా. ఆయ‌న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి ఒక ఛాలెంజ్‌ని విసిరారు. అదేమిటంటే...  క్వారంటైన్‌ సమయంలో రాజమౌళి తన భార్యకు సాయం చేస్తూ.. ఇంటి పనుల్లో పాలుపంచుకోవాలని సవాల్‌ విసిరారు. దీనికి సంబంధించి ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా ఓ మెసేజ్‌ని పోస్ట్ చేశారు.  ‘మనిషి ఇంటి పనులను గొప్పగా చేయగలడు. నిజమైన వ్యక్తి ఇంటి భారాన్ని కేవలం మహిళలపై వేయాలని అనుకోడు. ముఖ్యంగా ఇలా పనిమనిషి రాలేని క్వారంటైన్‌ సమయంలో అస్సలు చేయనివ్వడు. దయచేసి ఇంటి పనుల్లో మహిళలకు సహాయం చేయండి. నిజమైన మనిషిగా జీవించండి. ఇంటి పనుల్లో భాగస్వామ్యం అయ్యి మిగతావాళ్లకు ఆదర్శంగా నిలవాలని ఎస్‌ఎస్‌ రాజమౌళి గారిని కోరుతున్నాను. అంటూ ఓ పోస్ట్‌ని పెట్టారు. దీనికి సంబంధించి ఆయ‌న ఇంట్లో పనులు చేస్తున్న వీడియోను కూడా జత చేశారు. వంటింట్లో గిన్నెలు కడగటం, ఇళ్లు శుభ్రం చేయడం వంటి పనులను సందీప్‌ చేశారు.

 

ఇక  ఈ క్ర‌మంలోనే  రాజ‌మౌళి ఓ ఛానెల్ లైవ్లో మాట్లాడుతూ ఉండ‌గా ఈ విష‌యాల‌ను ఆయ‌న చెపుతూ ఎక్కువ మంది చాట్ కామెంట్లో యూ ట్యూబ్‌లో బాల‌య్య ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి సినిమా చేయాల‌ని నంద‌మూరి ఫ్యాన్స్‌ కామెంట్లు పెట్టారు. దానికి ఆయ‌న త‌ప్ప‌కుండా చేస్తాన‌ని ఆ రోజు కోసం ఆయ‌న కూడా ఎదురు చూస్తున్న‌ట్లు తెలిపారు. క‌థ క‌థ‌నాలు అన్నీ కుదిరితే సినిమా చేస్తాన‌ని ఆయ‌న అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: