ప్ర‌స్తుతం లాక్‌డౌన్ న‌డుస్తుండ‌డంతో సినిమా వాళ్లు ఇళ్ల‌ల్లోనే ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఆగిపోవ‌డంతో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సైతం ప్ర‌స్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ రోజు ఓ ఛానెల్ లైవ్‌లోకి వ‌చ్చిన రాజ‌మౌళి ఓ విష‌యంలో పొర‌పాటుగా ఓ బూతు మాట మాట్లాడి వెంట‌నే నాలిక్క‌ర‌చుకుని సారీ అని చెప్పారు.

 

గ‌తంలో త‌న తండ్రి రైట‌ర్‌గా క‌థ‌లు రాస్తున్న‌ప్పుడు త‌మ‌కు కొన్ని సీన్లు ఎంత‌గా ఆలోచించినా ఎలా రాయాలో ఆలోచ‌న‌లు త‌ట్టేవి కావ‌ని.. త‌ర్వాత కొంద‌రు రైట‌ర్లు వ‌చ్చి ఆ సీన్ల గురించి అదిరిపోయే వివ‌ర‌ణ ఇస్తున్న‌ప్పుడు త‌మ‌లో ఎక్క‌డా లేని ఉత్సాహం వ‌చ్చేద‌ని... అమ్మ‌నీయ‌మ్మా అదిరిపోయింది.. దీనికి ఇంత ప‌వ‌ర్ ఉందా ? అని అనుకునే వాడిన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే రాజ‌మౌళి పొర‌పాటుగా అమ్మ‌నీయ‌మ్మ అన్న ప‌దం వాడి వెంట‌నే సారీ చెప్పి త‌న లైవ్ కంటిన్యూ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: