టాలీవుడ్ సినిమాలకు మార్కెట్ పెరగడం తో ఇతర భాషల హీరోలు ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగింది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా సినిమాలను ఇక్కడ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. మన తెలుగు హీరోలు కూడా మార్కెట్ పెరగడం తో ఇతర భాషల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇది పక్కన పెడితే రజనీ కాంత్ అల్లుడు ధనుష్ ఇక్కడ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. తెలుగు హీరోతో కలిసి మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేసాడట. 

 

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అతను ఒక అగ్ర హీరో తో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తుంది. కథ ఇప్పటికే అతని వద్ద కూడా ఉందని సమాచారం. అందుకే అతను ఎక్కువగా ఇక్కడ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇక్కడ తాను చేసే సినిమాకు పెట్టుబడి కూడా తానే పెట్టాలి అని కూడా అతను భావిస్తున్నట్టు సమాచారం. కథ బాగుంది కాబట్టి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందుకే పెట్టుబడి తాను పెట్టాలి అని చూస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మన తెలుగు హీరోలు కూడా ఇతర భాహల్లో మార్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

దీనిని ధనుష్ వాడుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కథ లో మార్కెట్ పెంచుకునే విధంగా కొన్ని కోణాలను యాడ్ చెయ్యాలని తెలుగు కి తగిన విధంగా కథ ఉంటే మంచిది అనే భావనాలో అతను ఉన్నాడని ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాల్సి ఉంది. మన తెలుగు హీరోలకు తగిన విధంగా కథ ఉంటే ఇక్కడ ఆదరిస్తారు అనేది ధనుష్ నమ్మకం అని అంటున్నారు టాలీవుడ్ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: