ఇప్పుడు మన తెలుగులో సినిమాలు చేయడానికి బాలీవుడ్ హీరోయిన్ లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. కథ బాగుంది అనుకుంటే అగ్ర హీరో అనుకుంటే వాళ్ళు సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు సినిమాలకు పెరుగుతున్న మార్కెట్ కూడా తమకు కలిసి వస్తుంది అనే భావనలో ఉన్నారు బాలీవుడ్ హీరోయిన్ లు. ఇక దర్శకులు నిర్మాతలు కూడా వాళ్లకు అవకాశం ఇవ్వాలి అని ఎక్కువగా చూస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ళ మార్కెట్ ని దృష్టి లో పెట్టుకుని ఈ ఆఫర్లు ఇస్తున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తాను నటిస్తా అని దీపిక పదుకునే ఓకే చేసినట్టు సమాచారం. ఆమెను జక్కన్న సంప్రదించగా ఆమె అందుకు ఓకే చెప్పింది అని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఈ సినిమా కోసం ఆమె భారీగా వసూలు కూడా చేస్తుంది అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఈ సినిమాలో ఆమె నటించడం దాదాపుగా ఖాయం అయింది అనేది కూడా ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న మాట. ఆమె కోసం మంచి పాత్రను కూడా జక్కన్న సిద్దం చేయిస్తున్నాడు అంటున్నారు. 

 

సినిమా కోసం ఆమె కూడా ఎదురు చూస్తుంది అంటున్నారు. మహేష్ బాబు తో సినిమా చేస్తే తెలుగులో డిమాండ్ కూడా పెరుగుతుంది అనే భావనలో దీపిక ఉందని బాలీవుడ్ జనం కూడా అంటున్నారు. ఇక ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెట్టే అవకాశం ఉంది అనేది అర్ధం కావడం లేదు. ప్రస్తుతం కరోనా కారణంగా ఎప్పుడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉందో ఎవరూ కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. టాలీవుడ్ జనాలు కూడా ఇప్పుడు సినిమాల కోసం ఎదురు చూడటం దాదాపుగా మానేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: