పూరి జగన్నాథ్ సినిమాల కోసం మన తెలుగులో ఎంత ఎదురు చూస్తారో అందరికి తెలిసిందే. ఆయన సినిమాలు అనగానే యూత్ లో ఒక క్రేజ్ ఉంటుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు అనుకునే హీరోలు కూడా ఉన్నారు ఇప్పుడు టాలీవుడ్ లో. ఆయన కు ఈ మధ్య మళ్ళీ డిమాండ్ పెరిగింది. యువ హీరో రామ్ తో ఆయన చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయం సాధించడం తో యువ హీరోలు ఎక్కువగా ఆయన తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరో గా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. కరోనా కారణంగా ఈ సినిమాను వాయిదా వేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో విజయ్ ని ఒక బాక్సర్ గా చూపిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన మరో భారీ ప్రాజెక్ట్ కి ఓకే చేసినట్టు సమాచారం. బాలీవుడ్ హీరో తో ఆయన సినిమా చేయడానికి రెడీ అయినట్టు టాలీవుడ్ లో ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఫైటర్ సినిమాలో... నిర్మాతగా కరణ్ జోహార్ కూడా ఉన్నారు. ఆయనకు ఒక కథను వినిపించగా అందుకు ఓకే చెప్పాడు  అని అంటున్నారు. 

 

ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు అనేది టాలీవుడ్ జనాల మాట. ఆ సినిమాను షాహిద్ కపూర్ తో అక్కడ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిజం ఎంత అనేది పక్కన పెడితే ఈ సినిమా కోసం పూరి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ ఒక్క హిట్ కొడితే చాలు వరుస ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉందీ అనే భావనలో పూరి కూడా ఉండి ఈ సినిమా కు రెడీ అయ్యారట.

మరింత సమాచారం తెలుసుకోండి: