సక్సిస్ఫుల్  డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన మొదటి సినిమా బద్రి తో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం  ఉన్న పరిస్థితుల్లో పూరి పేరు వినగానే ప్రేక్షకుల్లో ఓ రకమైన వైబ్రేషన్ వస్తుంది. డైలాగ్ పంచులలో ఆయనది  ప్రత్యేకమైన స్టైల్. ఇండస్ట్రీలో  ఎలాగోలా బతకడానికి రాలేదు హిట్ సినిమాలు తీయడానికి వచ్చాను అంటూ సక్సెస్ ల పరంపర కొనసాగించారు. తన కెరియర్ లో పోకిరి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వసూలు చేశాయి. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణతో పూరి పైసా వసూల్ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది కలెక్షన్ల పరంగా కూడా హిట్ సాధించింది. ఈ సందర్భంగా ఆయనను బాలకృష్ణ గారి గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.

 

ఈ సందర్భంగా నాకు బాలకృష్ణ గారి నువ్వంటే చాలా ఇష్టం. అప్పటివరకూ  ఆయన పోషించిన పాత్రలన్నీ సీరియస్ గా ఉంటాయి మరియు సరదాగా సాగిపోయే పాత్ర చేసి చాలా రోజులైంది అందుకే ఆయనతో పైసా వసూల్ చేశా. నా సినిమాలో ఎంత ఎనర్జీతో ఉన్నారో బయట కూడా అంతే ఎనర్జీ గా ఉంటారు. నేనేమీ కొత్తగా చూపించలేదు. ఈ సినిమా ద్వారా నాకు ఆయనే ఏంటో చూపించాడు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. స్టోరీ చెప్పేటప్పుడు కేవలం పది నిమిషాలు మాత్రమే స్టోరీ చెప్పాను ఆ తర్వాత వారం రోజుల్లో పూర్తి స్క్రిప్ట్ చెబుతాం అని చెప్పాను. అందుకు బాలకృష్ణ గారు అవసరం లేదు నీ  సినిమాలన్నీ చూసా నువ్వేంటో నాకు తెలుసు మనం  షూటింగ్ కు వెళ్లిపోతాం అని అన్నారు.  తేడా సింగ్ అన్న పేరు కూడా ఆయనకు తెలియదు. ఈ సందర్భంగా నాతో సినిమా చేయొద్దని బాల కృష్ణ గారికి చాలా మంది చెప్పారు అంట మరియు నాతో 'ఆయనతో కష్టమండి 'అని నాకు కొంత మంది చెప్పారు .కలిసిన తర్వాత ఆయనేంటో నాకు తెలిసింది

మరింత సమాచారం తెలుసుకోండి: