టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో ఆయన నటిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ లు కలిసి దీనిని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అంజలి, నివేత థామస్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే రెండేళ్ల క్రితం పవన్, త్రివిక్రమ్ ల మూడవ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా ఘోర పరాజయాన్ని అందుకుని పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. 

 

అయితే ఆ తరువాత సినిమాలకు కొంత విరామం పలికి తన రాజకీయ జీవితంలో నిమగ్నమైన పవన్, ఇటీవల వకీల్ సాబ్ తో రీఎంట్రీ ఇస్తుండడంతో ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కెరీర్ 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి ఫెయిల్ అవడంతో, అందరి అంచనాలు వకీల్ సాబ్ పైనే ఉన్నాయి. అలానే దీనితో పాటు మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ రోల్ అదిరిపోనుందని టాక్. ఎంతో భారీ బడ్జెతో ఆ సినిమాని నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. 

 

ఆపై పవన్, హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమా కోసం ఇప్పటికే అద్బుతమైన కథం సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయ్యారు దర్శకుడు హరీష్. ఇక మొత్తంగా పవన్ నుండి రాబోతున్న ఈ మూడు సినిమాలతో ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కావడం ఖాయం అని, మధ్యలో వచ్చిన రెండేళ్ల గ్యాప్ ని, ఈ మూడు సినిమాలతో పూర్తి చేయడంతో పాటు, పలువురి పేరిట ఉన్న రికార్డులు అనే బాకీలు పవన్ తీర్చేయడం ఖాయం అంటూ ఆయన ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: