టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ కెరీర్ మొదలు పెట్టి 20 ఏళ్లు అయ్యింది.   సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రియ శిష్యుడిగా ‘బద్రి’ సినిమా దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టాడు పూరి జగన్నాథ్.  ఈ మూవీ తర్వాత ఇడియట్ మూవీతో మరో సెన్సేషన్ హిట్ అందుకున్నాడు.  ఇక మహేష్ బాబు తో ‘పోకిరి’ మూవీతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రికార్డు మోత మోగించాడు.  నేటికి పూరి  ప్రస్థానం 20 అయ్యింది.. దాంతో ఆయనకు ఎంతో మంది శుభాకాంక్షలు తెలిపారు.  తాజాగా అర్జున్ రెడ్డితో యూత్ క్రేజీ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ.  పూరి-విజయ్ దేవరకొండ కాంబినషన్ లో ‘ ‘ఫైటర్’  రూపొందుతుంది.

 

ఏప్రిల్ 20న విడుదలైన పవన్ కల్యాణ్ ‘బద్రి’ సినిమాతో పూరీ జగన్ దర్శకుడిగా అరంగేట్రం చేశారు.  తాజాగా విజయ్ దేవరకొండ ‘బద్రి’ సినిమా టైమ్‌లో ఏం చేస్తుందీ తెలుపుతూ.. ప్రస్తుతం తను మూవీ చేస్తున్న దర్శకుడైన పూరీ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.  అంతే కాదు ఈ మూవీ గురించి మరికొన్ని సెన్సేషన్ కామెంట్స్ కూడా చేశాడు విజయ్ దేవరొకొండ.  నేను 20 క్రితం బద్రి సినిమా థియేటర్లో చూశాను.. అప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నా.. ఈ మూవీలో హే చితికా అనే పాట అంటే చాలా ఇష్టం.  

 

ఈ పాటలో బైక్ రైడింగ్ చేస్తూ పవన్ కళ్యాన్ గారు స్టైలిష్ లుక్ తో కనిపిస్తారు.. అప్పట్లో ఆ పాట చాలా సార్లు పాడున్నానని అన్నారు. ప్రస్తుతం మిమ్మల్ని, మన సినిమా షూటింగ్‌ని మిస్ అవుతున్నాను. నేను నటుడిగా రిటైర్ అయ్యే వరకు మీరు ఆరోగ్యంగా ఉండి, ఇలాగే సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. 20 ఇయర్స్ ఆఫ్ పూరీ జగన్’’ అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: