తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు ఎలాగంటే పిండి కొద్దీ రొట్టె ఎలానో సినిమా కథ , హీరోయిన్ అందాలు, ఇంకా చెప్పాలంటే ,ఇప్పుడు యువత ను కట్టిపడేసే విధంగా రొమాన్స్ ఇలా అన్నీ ఉంటే సినిమా హిట్ అని వేరేలా చెప్పనక్కర్లేదు..సినిమా హిట్ అవ్వాల్సిందే.. అలా హిట్ అయితేనే ఆ సినిమాలోని నటీనటులకు కొత్త సినిమా అవకాశాలు వస్తాయి..లేదంటే వారి సినిమా అవకాశాలు మాత్రం గాల్లో కలిసిపోయింది అని చెప్పాలి..

 

 

 

 

 

సూపర్ సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అనుష్క .. ఆ సినిమా హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.. ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించిన అనుష్క నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. బాహుబలి లాంటి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. ఆ తర్వాత బాహుబలి 2 లో నటించి  మెప్పించారు.. అందుకే ఆ సినిమా కూడా హిట్ అవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఘనత అనుష్కకు చెందుతుంది..

 

 

 

 

 

భాగమతి తో అనుష్క మంచి విజయాన్ని అందుకుంది..ఆ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న స్వీట్ ఇప్పుడు 'నిశ్శబ్దం' .. హేమంత్ మధకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు..చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా విడుదలకు వాయిదా పడింది ..

 

 

 

 

 

ఈ నేపథ్యంలో 'నిశ్శబ్దం' సినిమాకి అమెజాన్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. సినిమా పూర్తయిపోయి నెలకి 50 లక్షలు వడ్డీలు కట్టుకుంటున్న నిర్మాతలు, అమెజాన్ కి ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అమెజాన్ కి ఇవ్వాలంటే అందుకు అనుష్క అనుమతి కూడా కావాలి. అయితే, ఆమె మాత్రం అంగీకరించడం లేదట. దాంతో వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న నిర్మాతలు, ఆమె ధోరణి పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారట..అమెజాన్ నిజంగా ఈ సినిమాను విడుదల చేస్తారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: