లాక్ డౌన్ టైంలో టైం పాస్ కోసం సినిమాలు, టివిలు, ఆన్ లైన్ మూవీస్ ఇలా రకరకాలుగా ఎంటర్టైన్ అవుతున్న ప్రేక్షకులు కొత్త షోల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త షోలు వచ్చే ఛాన్స్ లేదు.. అయితే యాంకర్ సుమ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ షో ప్రయత్నించారు. బుల్లితెర టాప్ యాంకర్స్ ప్రదీప్, రవి, అనసూయ, రష్మీ వీరందరితో కలిసి సుమ చేసిన స్పెషల్ షో సుమక్క సూపర్ 4. ఈ సుమక్క సూపర్ 4 షో లేటెస్ట్ గా వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఈషోలో నలుగురు యాంకర్స్ తో సుమ చేసిన హంగామా ఆకట్టుకుంది. 

 

ఈ స్పెషల్ షోలో మూడు రౌండ్లు ఏర్పాటుచేశారు. అందులో మొదటిది సోషల్ స్టడీస్.. అందులో మూడు ప్రశ్నలు అడిగి సరైనా సమాధానం చెప్పిన వారికి 10 పాయింట్స్ ఇస్తారు. బజార్లు గట్రా లేవు కాబట్టి ప్లేట్ ను గంటతో కొట్టాలని చెప్పింది సుమ. ఇక రెండవ రౌండ్ గా ఇండోర్ రామయ్య ఇందులో కూడా మూడు ప్రశ్నలువేసింది. మూడవ రౌండ్ గా అవుట్ డోర్ కృష్ణయ్య ఇందులో కూడా మూడు ప్రశ్నలడిగిన సుమ చివరి ప్రశ్న అడిగే సరికి నలుగురు యాంకర్లు సమానమైన స్కోర్స్ తో ఉన్నారు. అయితే చివరి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారికి ఒక ఫారిన్ ట్రిప్ ఉంటుందని అన్నారు. 

 

అయితే చివరి ప్రశ్నకు అందరు కూడా ఒకేసారి సమాధానం ఇచ్చారు. సుమ వాళ్లందరికీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నలుగురికి ఫ్యామిలీతో ఫారిన్ వెళ్లే ఛాన్స్ ఇస్తా అంది.. అయితే ఆ ట్రిప్ ఎక్కడికి అంటే.. చైనాలోని వుహాన్ అని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ పేరు వింటేనే అందరు వణికేస్తున్నారు. అలాంటిది అక్కడకు ఎలా వెళ్తారు చెప్పండి.. మాకు ఈ ట్రిప్ వద్దు అంటూ మిగతా వాళ్లకు ఆ ఆఫర్ ఇస్తే అందరు వాటిని రిజెక్ట్ చేశారు. ఫైనల్ గా ఈ షో ద్వారా వచ్చిన డబ్బులను కరోనా క్రైసిస్ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి విరాళంగా ఇవ్వబడుతుంది అన్నారు. ఐదుగురు యాంకర్లు తమ ఇళ్లలో ఉండే ఈ షో చేశారు. మొత్తానికి ఇళ్ల దగ్గర ఉండి కూడా ఆడియెన్స్ ను అలరిస్తూ ఎంటర్టైన్ చేస్తూ అలా వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని తమ మంచి మనసు చాటుకున్నారు యాంకర్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: