`బాహుబ‌లి`కి ముందు ఒక లెక్క‌.. బాహుబ‌లి త‌రువాత ఒక లెక్క‌..అన్న‌ట్టుగా మారిపోయింది రాజ‌మౌళి క్రేజ్‌. ఇప్ప‌డు జ‌క్క‌న్న‌తో ఒక్క సినిమా అయినా చేయాల‌ని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ప్ర‌తీ టాప్ హీరో ఎదురు చూస్తున్నాడు. ప్ర‌స్తుతం జ‌క్క‌న్న టాప్ హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌తో భారీ చిత్రం `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

 

మూవీ త‌రువాత జ‌క్క‌న్న‌ మ‌హేష్‌తో సినిమా వుంటుంద‌ని ఇటీవ‌ల రాజ‌మౌళి స్ప‌ష్ట‌త‌నిచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆ త‌రువాత ఎవ‌రితో వుండే అవ‌కాశం వుంద‌ని అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. ఇదిలా వుంటే లాక్‌డౌన్ వేళ రాజ‌మౌళి ఓ టీవీ ఛాన‌ల్ నిర్వ‌హించిన లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ఆయ‌న‌ వెల్ల‌డించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో మీ నుంచి సినిమా ఆశించొచ్చా అని అడిగితే జ‌క్క‌న్న షాకిచ్చే స‌మాధానం చెప్పాడు.

 

ప‌వ‌న్‌తో సినిమా చేయ‌లేన‌ని చెప్ప‌కుండా తెలివిగా స‌మాధానం చెప్పాడు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిబ‌ద్ధ‌త‌గ‌ల నాయ‌కుడు. ఆయ‌న దృష్టంతా రాజ‌కీయాల‌పై ఉంది. ఏడాది కాలంలో సినిమా షూటింగ్‌ల కోసం త‌క్కువ స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు. నాకేమో సినిమా పూర్తి చేయ‌డానికి సంవ‌త్స‌రాలు ప‌డుతోంది. నా కోసం తన విలువైన స‌మ‌యాన్ని ఒక‌టి లేదా రెండు సంవ‌త్రాలు కేటాయించ‌మ‌ని కోర‌డం స‌ముచితం కాద‌ని అన్నారు. అంటే సుతిమెత్త‌గా ఆయ‌న తిర‌స్క‌రించారు. ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషి. 

 

కాబ‌ట్టి ఇద్ద‌రి దారులు, స్వ‌భావం భిన్నంగా వున్నందున అభిమానులు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో సినిమా ఆశించ రాదు. అని రాజ‌మౌళి తెలివిగా స‌మాధానం చెప్ప‌డం ఆక‌ట్టుకుంటోంది. చేయ‌న‌ని చెప్ప‌లేక జ‌క్క‌న్న తెలివిగా స‌మాధానం చెప్పాడ‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి జ‌క్క‌న్న ప‌వ‌న్‌తో అయితే ఫ్యూచ‌ర్‌లో కూడా సినిమా చేస్తాడో చేయ‌డో అన్న కొత్త ఆలోచ‌న‌లు అయితే క‌లిగేలా చేశాడు రాజ‌మౌళి. మ‌రి దీంతో చాలా ఫ్యాన్స్ నిరాశ చెందారు. ప‌వ‌న్ కూడా ఎప్ప‌టికైనా ప్యాన్ ఇండియా మూవీ చెయ్యాల‌ని అది కూడా ఒక రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుడితో చేయాల‌ని ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. అయితే రాజ‌మౌళి మాట‌లు చూస్తుంటే మాత్రం ఇక అది సాధ్య‌ప‌డే విష‌యం లా లేద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: