స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'పుష్ప'. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. సక్సస్ ఫుల్ చిత్రాలని అందిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'ఆర్య'..  'ఆర్య2' తర్వాత అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా గా రూపొందుతుంది. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందితున్నాడు. మళ్ళీ ఎలాగైనా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చి ఫాం లోకి రావాలన్న కసితో ఉన్నాడు.

 

శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమా కథ ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ రాయలసీమ యాసలో మాట్లాడతాడట. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అల్లు అర్జున్ కంప్లీట్ మాస్ గెటప్ లో ఆకట్టుకున్నాడు. రంగస్థలం సినిమా టైం లో రాం చరణ్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో అదే రెస్పాన్స్ ఇప్పుడు పుష్ప పోస్టర్ లో అల్లు అర్జున్ కి వచ్చింది. ఇక ఈ సినిమాని తెలుగు-హిందీ-తమిళం- మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

 

ఇక రంగస్థలం తో సుకుమార్ అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ సక్సస్ లని అందుకొని ఉండటం తో ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు అల్లు అర్జున్-సుకుమర్-దేవీ శ్రీప్రసాద్ కలిసి మళ్ళీ మ్యాజిక్ చేయబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే సుకుమార్ ఈ సినిమాలో రష్మిక పాత్రని చాలా విభిన్నంగా రూపొందించినట్టు తెలుస్తుంది. అంతేకాదు రష్మిక ఒక గిరిజన యువతిగా ఈ సినిమాలో కనిపించబోతుందని అంటున్నారు. ఇక ఈ పాత్రకోసం రష్మిక చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడేందుకు భాష నేర్చుకుంటుందని సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: