మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసందే. ఇక ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ లేకుండా సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి ఫాం లో ఉన్న కొరటాల చిరంజీవి కాంబినేషన్ లో సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్, ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోను భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని కూడా పాన్ ఇండియా కేటగిరీలోనే నిర్మిస్తుండటం విశేషం.

 

ఇక ఈ సినిమా తో పాటు చిరంజీవి మరి కొంతమంది దర్శకులను ఎంగేజ్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళలో అందరూ యంగ్ డైరెక్టర్స్ ఉండటం ఇక్కడ ఇండస్ట్రీ మొత్తం షాకయ్యో విషయం. ఆచారూ తర్వాత లూసీఫర్ రీమేక్ చేయనున్నారు చిరంజీవి. ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు. ఇది సుజీత్ కి మూడో సినిమానే. ఇక నెక్స్ట్ సినిమా బాబి దర్శకత్వంలో ఉండనుందట. బాబి చెప్పిన కథ కూడా చిరంజీవి కి బాగా నచ్చిందని దాదాపు ఇదే నెక్స్ట్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. ఇలా వరసగా అందరూ యంగ్ డైరెక్టర్స్ కే ఛాన్స్ ఇస్తున్నారన్న విషయంలో కూడా చిరంజీవి ఎవరూ ఊహించని సమాధానం చెప్పారు.

 

యంగ్ డైరెక్టర్స్ అయితే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోగలనని క్లారిటి ఇచ్చారు. అంటే ఇది సీనియర్ దర్శకులని వేరేలా కామెంట్ చేసినట్టు కాకపోయినప్పటికి చిరు ఇలా సీక్రెట్ ఓపెన్ చేయడంలో సీనియర్ దర్శకులలో కాస్త ఆలోచన మొదలైంది. మనం కూడా చిరు ని ఎలా చూపించాలి ..ఎలాంటి కథ చెప్పాలి అని ఆలోచనలో ఉన్నారట. ఒకరకంగా ఇది కాస్త సీనియర్ దర్శకులకి షాకే అని చెప్పుకుంటున్నారు. ఇక యంగ్ డరెక్టర్స్ జాబితాలో హరీష్ శంకర్, పరశురాం, సుకుమార్ లు కూడా ఉన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: