మెగా అభిమానులు అల్లు అర్జున్ అదేవిధంగా అల్లు శిరీష్ ఏచిన్నపని చేసినా దాని వెనుక నెగిటివ్ కోణంలో కారణాలు వెతుకుతూ అల్లు కాంపౌండ్ హీరోలను టార్గెట్ చేయడం ఒక పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ తో ఖాళీగా ఉన్న అల్లు శిరీష్ అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ ఇప్పుడు చిరంజీవి అభిమానులకు విపరీతమైన కోపాన్ని తెప్పించింది.


కరోనా సమస్యతో జనం అంతా స్వీయ గృహ నిర్భంధంలోకి వెళ్లిపోవడంతో హాస్పటల్స్ లో ఎమర్జెన్సీ కేసులు చూసే డాక్టర్లు కూడ కరువైపోయారు. దీనికితోడు డాక్టర్లు ఎమర్జెన్సీ ఆపరేషన్లు ఎవరికైనా చేయాలి అని ప్రయత్నిస్తున్నా ఆస్పత్రుల్లో రక్తం కొరత ఏర్పడింది. ఈ పరిస్థితులలో తలసీమియా వ్యాధితో బాధపడే రోగులు రక్తం దొరకక పోవడంతో విపరీతంగా కష్టాలు పడుతున్నారు. 

 

ఈ సమస్యలు చిరంజీవి దృష్టి వరకు రావడంతో మెగా స్టార్ వెంటనే స్పందించి తాను రక్త దానం ఇవ్వడమే కాకుండా తన అభిమానులు అందరు కూడ రక్తం దానం చేసి బాధితుల ప్రాణాలు కాపాడండి అంటూ ఒక పిలుపు ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించిన వీడియోను కూడ చిరంజీవి షేర్ చేసాడు. 

 

మెగా స్టార్ పిలుపుకు అతడి అభిమానుల నుండి విపరీతమైన స్పందన వస్తోంది. చిరంజీవి పిలుపుకు స్పందిస్తూ అల్లు శిరీష్ ‘డన్ కేసీ గారు.. తప్పకుండా మేం తొందరగా రక్తదానం చేస్తాం’ అంటూ ట్విట్టర్ లో చిరంజీవి వీడియోను షేర్ చేసి తన కామెంట్ ను జత చేసాడు. అయితే ఇప్పుడు శిరీష్ కామెంట్ పై నిన్నటి నుండి మెగా అభిమానుల నుండి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. దీనికి కారణం చిరంజీవిని ‘కేసీ గారు’ అంటూ శిరీష్ పిలవడం పై మెగా అభిమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గౌరవంగా మెగా స్టార్ అంటు పిలవలేవా  అంటూ శిరీష్ మెగా అభిమానులు రివర్స్ క్లాస్ పీకుతున్నారు..    

మరింత సమాచారం తెలుసుకోండి: