యాంగ్రీ యంగ్ హీరో విశ్వక్ సేన్  నటించిన లేటెస్ట్ మూవీ హిట్ ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయ్యింది.  క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన  ఈ చిత్రం  ఫుల్ రన్ లో 6కోట్ల వసూళ్లను రాబట్టి ఈఏడాది నాలుగో హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా ప్రస్తుతం ట్రేండింగ్ లో కొనసాగుతుంది.  ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కలను జెమిని టీవి దక్కించుకుంది.
 
మే 1న సాయంత్రం 6:30 గంటలకు జెమినీ లో ఈ చిత్రం ప్రసారం కానుంది. కరోనా నేపథ్యంలో మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగనున్న విషయం తెలిసిందే. దాంతో హిట్ భారీగా టీఆర్పీ రేటింగ్స్  ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. వాల్ పోస్టర్ సినిమా పతాకం పై  నేచురల్ స్టార్ నాని మరియు అతని స్నేహితురాలు ప్రశాంతి త్రిపురనేని నిర్మించిన ఈ చిత్రంలో చిలసౌ ఫేమ్ రుహాణి శర్మ హీరోయిన్ గా నటించింది. నూతన దర్శకుడు శైలేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు  సీక్వెల్ కూడా రానుందని సమాచారం. వచ్చే ఏడాది హిట్ 2 సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు వున్నాయి. 
 
ఇదిలావుంటే ఈనగరానికి ఏమైంది ?, ఫలక్ నుమా దాస్ లతో  బ్యాక్ టు బ్యాక్  ప్లాపులను ఖాతాలో వేసుకున్న  విశ్వక్ సేన్  ఎట్టకేలకు  హిట్ తో కెరీర్ లో మొదటి హిట్ కొట్టాడు. ఈ సినిమా తరువాత విశ్వక్ సేన్  పాగల్ లో నటించనున్నాడు. నూతన దర్శకుడు నరేశ్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం జులై నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఉప్పెన బ్యూటీ  కృతి శెట్టి ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: