రష్మిక మందన... ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పీక్ స్టేజ్ లో తన ప్రయాణాన్ని సాగిస్తున్న హీరోయిన్. ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి పరిచయమైన రష్మిక ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. నిజానికి ఛలో, గీత గోవిందం సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకోవడంతో రష్మిక వెనక అనేక ఆఫర్లు వచ్చాయి. అందులో కొన్నిటిని ఉంచుకుని ముందుకు సాగుతూ వస్తోంది రష్మిక.

 


ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి తన నటనను మరో కోణంలో చాటి చెప్పింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో సినిమాలు తనను వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే ఆమె తాజాగా నటించిన భీష్మ కూడా బాగానే విజయాన్ని అందుకున్నదని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాలో రష్మిక నటిస్తోంది. అయితే ఈ సినిమా ఎర్రచందనం దుండగుల అక్రమ రవాణా నేపథ్యంలో స్టోరీ కొనసాగుతుంది. అయితే అడవి నేపథ్యంలో ఈ కథ మొత్తం ఆసక్తికరంగా సాగే విధానంలో అల్లు అర్జున్ జోడిగా రష్మిక మందన నటించబోతోంది.


అయితే రష్మికసినిమా గురించి తెలియజేస్తూ ఇందులో తన పాత్ర గురించి మాట్లాడుతూ.... ఈ పాత్రలో నేను చాలా కొత్తగా కనిపిస్తా అని నటన పరంగా కూడా నా లోని మరో కోణాన్ని చూస్తారు అంటూ తెలిపింది ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమాలో నా పాత్ర నా సినీ జీవితంలో చెప్పుకోదగిన రోల్ గా నిలిచిపోతుందని పక్కాగా చెబుతుంది ఈ భామ. ఇదివరకు ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంతో షూటింగ్ వాయిదా పడింది. అయితే రష్మిక ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరు నటిస్తున్న ఆచార్యా లో చరణ్ సరసన ఈ భామ నటించబోతోంది. ఆచార్య సినిమా శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: