దేశంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని ఇలాంటి కొంతమంది వల్ల తెలుస్తుంది. లాక్ డౌన్ కారణంగా సినీ తారలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ కొంతమంది తారలు తమ జాలి గుణాన్ని మరియు గొప్పతనాన్ని ఏదో విధంగా తెలియజేస్తూనే ఉంటారు. జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ తన జాలి గుణాన్ని మరోమారు తెలియపరిచింది. లాక్ డౌన్ కారణంగా ఆహారం లేక అలమటిస్తున్న వీధి జంతువు లకు ఆహారం పెట్టి ఆదుకుంది.
ఈ క్రమంలో తన వీధిలోని ఓ చిన్ని కుక్క కాలికి తగిలిన గాయం తో రెండు నెలల నుంచి అలా తిరుగుతూనే ఉంది . ఆహారం దొరక్క ఆ కుక్క ఎటూ వెళ్లలేక ఆహారం కోసం తిరుగుతూ ఉండగా జాలిపడిన రష్మీ ఆహారం పెట్టి ఆ కుక్కకు ఆకలి తీర్చింది. డాక్స్ అధికారులు చూసి చెక్ చేసి వెళ్లిపోయారు కానీ ఇప్పటివరకూ రాలేదు. అడిగితే డాక్స్ ప్రయాణం అనుమతి లేదని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఇలాంటివి తప్పనిసరి సేవలు కాదా అని అడుగుతోంది... రష్మి గౌతమ్. వీడియోను గమనిస్తే ఓ చిన్న బకెట్ లో ఆహారాన్ని తీసుకొని వీధిలో తిరుగుతున్న జంతువుల అన్నిటికీ ఆహారం పెట్టే ప్రయత్నం చేసింది రష్మి. ఇందులో భాగంగా ఓ కుక్క కాలికి బలంగా తగిలిన గాయం తో వీధుల్లో తిరుగుతూ కనిపించింది. ఆ కుక్కకు ఆహారాన్ని అందించింది రష్మి
U see this little guy here
— rashmi gautam (@rashmigautam27) April 21, 2020
His leg was severe by a butcher its been over 2 months now
Even this one was inspected and they said they will come back but again now they have reasons docs cant travel or unavailable
Isn't this an essential service https://t.co/AsHlJNNMg5 pic.twitter.com/sxbL92uYAw