ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హిట్ తో టాలీవుడ్ లో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు శైలేష్ కొలను. ఇటీవల విడుదలైన  ఈచిత్రం డీసెంట్ హిట్ అనిపించుకుంది. అంతేకాదు  శైలేష్  డైరెక్షన్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి.  విశ్వక్ సేన్ హీరోగా నటించగా  నాని ఈ సినిమాను నిర్మించాడు.నాన్ థియేట్రికల్ రూపంలో  ఈసినిమా  కు నాని మంచి లాభాలను పొందాడు. ఇక శైలేష్ పనితీరుకు  ఫిదా అయిన నాని,  అతనికి  రెండో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. అయితే అది నిర్మాత గా కాదు  హీరోగా.. అవును శైలేష్ చెప్పిన స్టోరీ నానికి బాగా నచ్చడం తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు  ఫిలిం నగర్ టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
 
ఇక నాని ప్రస్తుతం రెండు సినిమాలకు సైన్ చేశాడు. అందులో మొదటిది టక్ జగదీష్.. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే  మొదటి షెడ్యూల్ కంప్లీట్  చేసుకోగా కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈచిత్రంలో నాని కి జోడిగా రీతూ వర్మ, ఐష్వర్య రాజేష్ నటిస్తుండగా జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రిన్స్  ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా తరువాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో నాని 'శ్యామ్ సింగ రాయ్' నటించనున్నాడు.  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించనున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఇదిలావుంటే నాని  నటించిన వి విడుదలకు సిద్ధంగా వుంది. మార్చిలోనే విడుదలకావాల్సిన  ఈచిత్రానికి కరోనా షాక్ ఇచ్చింది. దాంతో జులై లో ఈసినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: