అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ అందం మరియు ఆరోగ్యం లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎలాంటి కాలంలోనైనా తన ఫిట్నెస్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అందం మరియు ఆరోగ్యం కోసం చాలా చిట్కాలు కూడా పాటిస్తారు. తాజాగా కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్నందున దానికి విరుగుడుగా ఓ పానీయాన్ని అభిమానులకు మరియు దేశ ప్రజలకు సూచిస్తుంది. రకుల్ ప్రీత్ తయారు చేసిన ఆ డ్రింక్ ఏమిటంటే.. మార్కెట్ లో ఎన్ని రకాల హెల్త్ డ్రింక్స్ మరియు ఎనర్జీ డ్రింక్స్ ఉన్నప్పటికీ సిద్ధంగా చేసుకున్న పానీయాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అని పెద్దలు చెబుతున్నమాటే. ప్రస్తుతం లాక్ డౌన్ పిరియడ్ లో ఇంటికే పరిమితమైన రకుల్ ప్రీత్ ఇంట్లో ఉండే వస్తువులతో సాధారణ పానీయాన్ని తయారుచేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఈ కరొనను ఎదుర్కోవటానికి మరియు ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుండి బయటపడటానికి శక్తిమంతమైన పదార్థాలను మరియు పానీయాలను తీసుకోవాలి .రకుల్ ప్రీతి చెప్పిన విధంగా... అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు మరియు పసుపు లను అర లీటర్ నీటిలో వేసి బాగా మరగ బెట్టుకోవాలి. మిశ్రమం అంతా పావు లీటర్ వచ్చేంతవరకు మరగబెట్టి ఆ పానీయాన్ని సేవించాలి. ఇదే ప్రస్తుతానికి కరోనా నుండి కాపాడే దివ్యౌషధం అంటోంది రకుల్. రకుల్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతానికి బాలీవుడ్ లో షిమ్లా మిర్చి, జాన్ అబ్రహంతో ఎటాక్, అజయ్ దేవగన్ తో థాంక్స్ గాడ్, తమిళంలో శివ కార్తికేయన్ తో ఆలయాన్, కమల్ హాసన్ తో ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ అమ్మడు ఇంట్లోనే లాక్ అయిపోయింది. ప్రస్తుతం లాక్ డౌన్ కాలాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది.
ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనే విధంగా ఆరోగ్యాన్ని పరీరక్షించుకోవాలి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఎప్పుడు ఆరోగ్యం, శారీరక పటుత్వంపై దృష్టిపెట్టాలి. మానసిక, శారీరకంగా ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచుకోవాలి. ఇంట్లో తయారు చేసుకొనే ఫుడ్ను, ఇతర వస్తువులను వినియోగించుకోవాలి అని రకుల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.