మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఉప్పెన. కరోనా లేకుంటే ఈపాటికే విడుదలకావాల్సింది కానీ ఈ మహమ్మారి వల్ల రెండు నెలలు వాయిదాపడింది. జూన్ లేదా జులై లో ఉప్పెన థియేటర్లలోకి వచ్చేలా వుంది.  ఈసినిమాలో తమిళ స్టార్ యాక్టర్ ,మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవలే  విజయ్ ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇక ఈ సినిమా విజయ్ కి బాగా నచ్చిందని, 96 కంటే ఉప్పెన స్టోరీ బాగుందని విడుదల తరువాత ఈ సినిమా గురించి అందరు మాట్లాడుకుంటారని విజయ్ అన్నారని డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఇటీవల ఓ ఇంటర్వ్యూ  లో వెల్లడించాడు.
 
ఇక ఇప్పుడు విజయ్,ఈసినిమా తమిళ రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నాడట. నిజానికి విజయ్ సేతుపతి వున్నాడు కాబట్టి తెలుగు తోపాటు తమిళంలోకి డబ్ చేసి విడుదలచేద్దాం అనుకున్నారు కానీ విజయ్ అడగడంతో మేకర్స్ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తమిళ నిర్మాణంలో కూడా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ భాగస్వామ్యం అవుతారని టాక్. 
 
రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం మైత్రి  25కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె కు ఇదే మొదటి సినిమా కాగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో ఉప్పెన పై అంచనాలు పెరిగిపోయాయి. మరి మొదటి సినిమాతో హిట్ కొట్టి వైష్ణవ్ తేజ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: