ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా తో కన్నడ స్టార్ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాహుబలి ఫ్రాంఛైజీ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో అంత క్రేజ్ యశ్ కేజీఎఫ్ సినిమాతో దక్కించుకున్నాడు. నార్త్, సౌత్ సినిమా ఇండస్ట్రీలలోని ప్రముఖ, దర్శకులు, నిర్మాతలు, స్టార్ హీరోలందరి తో ను యశ్ గొప్ప గొప్ప ప్రశంసలను అందుకున్నాడు. 

 

ఇక ఈ సినిమా రిలీజైన అన్నీ భాషలలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో హీరోలకి ప్రశాంత్ నీల్ ఫేవరేట్ అండ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్ లాంటి వాళ్ళు తన డైరెక్షన్ లో సినిమా చేయాలన్న క్రేజ్ ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా కి వచ్చిన క్రేజ్ చూసిన మేకర్స్ మళ్ళీ కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 నిర్మించాలని సన్నాహాలు చేశారు. అందులో భాగంగానే మేకర్స్ హీరో యశ్ తో కేజీఎఫ్2 ని నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ పార్ట్ పూర్తయిపోయిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 

 

అయితే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ఎన్.టి.ఆర్ తో ఉండనుందన్న వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పట్లో ఈ కాంబినేషన్ లో సినిమా నిర్మించడానికి మైత్రీ వారు సిద్దంగా లేరని తెలుస్తుంది.

 

అయితే అది కొంతకాలమే అని పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ ఈ కాంబోలో సినిమా ఉంటుందట. ఇందుకు కారణం ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్ చేసే ఆలోచన కరోనా కారణంగా ఇప్పట్లో చేయకపోవడమేనని అంటున్నారు. అంటే ఇది ఎన్.టి.ఆర్ కి షాకేనా అంటు మాట్లాడుకుంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: