రవితేజ హీరోగా నటించిన 'డిస్కోరాజా' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయినా సరే సినిమాల స్పీడ్ ను మాత్రం పెంచుతూనే ఉన్నాడు మాస్ మహారాజా. రవితేజ ప్రస్తుతం కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న 'క్రాక్' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 'డాన్‌ శీను', 'బలుపు' లాంటి సినిమాలతో ఆకట్టుకున్న రవితేజ - గోపిచంద్‌ మలినేనిలు కాంబోలో హ్యాట్రిక్‌ హిట్ కోసం రెడీ అవుతున్నారు. రవితేజ గత చిత్రాలు ప్లాప్ అవడంతో 'క్రాక్' సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాకి సంభందించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది.

 

‘క్రాక్’ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ లేడి విలన్ గా నటిస్తుందట. ఏదో మెయిన్ విలన్ చాటు లేడీ విలన్ లా కాకుండా.. ఆమె కూడా మెయిన్ విలన్ గానే చేస్తోందట. తన భర్తను చంపిన హీరో మీద పగ బట్టిన ఆడదాని పాత్రలో ఆమె చాలా బాగా నటిస్తోందట. నిజానికి నెగిటివ్ టచ్ ఉన్న రోల్స్ లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కనిపించడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకుముందు పందెంకోడి 2, సర్కార్, తెనాలి రామకృష్ణ సినిమాల్లోనూ అలాంటి పాత్రలలోనే కనిపించింది. అయితే హీరోయిన్ కు ఉండాల్సిన క్యాలిటీస్ అన్ని ఉన్నా ఎందుకో హీరోయిన్ గా మాత్రం వరలక్ష్మి శరత్ కుమార్ కంటిన్యూ కాలేకపోయింది. ఇండస్ట్రీ నుండి స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నా.. ఎక్కువుగా సేడ్ క్యారెక్టర్స్ కే పరిమితం అవుతూ వస్తోంది. కాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక యదార్థ సంఘటనల ఆధారంగా 'క్రాక్' సినిమా తెరకెక్కుతుంది. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మధ్య వరుస పరాజయాల్ని ఎదుర్కొంటున్న మాస్ మహారాజ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: