లాక్ డౌన్ టైం లో సెలబ్రిటీస్ ఇంట్లో ఉంటూనే కొన్ని ఛాలెంజ్ లు చేసుకుంటున్నారు. కేవలం ఇంట్లో ఉంటూ తమ పని తాము చేసుకున్నట్టు కాకుండా ఇంట్లో వాళ్లకు సహాయపడాలని కొత్తగా ట్విట్టర్ లో బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ నడుస్తుంది. డైరక్టర్ సందీప్ వంగ మొదటిసారి ఈ ఛాలెంజ్ ను రాజమౌళికి ఇవ్వగా రాజమౌళి ఆ ఛాలెంజ్ స్వీకరించి ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, సుకుమార్ లకు ఇచ్చాడు. తారక్, చరణ్ లతో పాటుగా కీరవాణి కూడా ఈ టాస్క్ పూర్తి చేశాడు. వాషింగ్ మెషిన్ లోని బట్టలు తీసి ఆరేసి.. మళ్ళీ వాటిని మడత పెట్టి.. డైనింగ్ టేబుల్ తుడిచి.. మొక్కలకు నీళ్లు పోసి అప్పుడప్పుడు బి ద రియల్ మ్యాన్ అని కీరవాణి టాస్క్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. 

 

కీరవాణి ఈ ఛాలెంజ్ ను మరో ఇద్దరికీ ట్రాన్స్ ఫర్ చేశారు. డైరక్టర్ క్రిష్ తో పాటుగా మ్యూజిక్ డైరక్టర్ థమన్ కు బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ విసిరాడు కీరవాణి. అయితే కీరవాణి ఇలా ఛాలెంజ్ చేశాడో లేదో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ కామెంట్ చేశాడు థమన్. అయితే డైరక్టర్ క్రిష్ దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఎన్టీఆర్ కూడా బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ ను మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలకు విసిరాడు. రామ్ చరణ్ మాత్రం ఈ టాస్క్ ను బాలీవుడ్ కు ట్రాన్స్ ఫర్ చేశాడు. రన్ వీర్ సింగ్, శర్వానంద్, రానాలకు ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశాడు. 

 

ఎప్పుడు పని వాళ్ళ మీద ఆధారపడి స్టార్స్ ఇలా ఇంట్లో పనులన్నీ తమకు తామే చేసుకోవడం మంచి విషయమని చెప్పొచ్చు. తమ దగ్గర పనిచేసే పని వాళ్ళ మీద రెస్పెక్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో కానీ ప్రస్తుతం సెలబ్రిటీస్ మాత్రం ఇంటి పని వంట పని అనే తేడా లేకుండా అన్ని చేసేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: